Tollywood: విడాకులు దిశగా స్టార్ విలన్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Tollywood.. ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు తమకు నచ్చిన వారిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు.. ఎప్పుడు విడాకులు ఇస్తారో తెలియదనే చెప్పాలి. పూర్వకాలంలో పెద్దలు కుదిర్చిన వివాహం అయితే వందేళ్లు కలకాలం ఉండేది అని పెద్దల నమ్మకం. పైగా ఇటీవల కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా సవ్యంగానే కాపురాలు చేస్తుంటున్నాయి. అయితే మరికొన్ని జంటలు మాత్రమే పిల్లలు పెళ్లీడుకొచ్చిన సమయంలో విడాకులు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నది విడాకుల ట్రెండ్ అనే చెప్పాలి

Tollywood: Star Villain towards Divorce.. Fans are worried..!
Tollywood: Star Villain towards Divorce.. Fans are worried..!

సమంత – నాగచైతన్య తోనే విడాకుల ట్రెండ్ మొదలు.

పైగా నాగచైతన్య – సమంత విడాకులు తర్వాత నుంచి చాలామంది నటీనటులు విడాకులు తీసుకోవడం సాధారణంగా మారిపోయింది. టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు చివరికి బుల్లితెర నటీనటులు కూడా విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తమ అభిమానం నటీనటులు వైవాహిక బంధంలో విడాకులు తీసుకొని వేరుపడుతుండడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ నటుడు విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం..

విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ విలన్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించి విలన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా. ఈయన బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు , చిరంజీవి ఆచార్య సినిమాలో నటించి తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. ఈయన తాజాగా 20 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . అంతేకాదు కూతురు కారణంగానే విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. నటుడు భార్య నీలాంజన తన భర్తతో పదేపదే గొడవలకు దిగడమే విడాకులకు కారణమైందని తెలుస్తోంది.

- Advertisement -

అందుకే విడాకులు తీసుకుంటున్న జిషు సేన్ గుప్తా..

అయితే ఇందుకు సరైన ఆధారాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే నీలాంజన తన భర్త జిషు సైన్ గుప్తాను సోషల్ మీడియా ఖాతాలో అన్ ఫాలో చేసింది. ప్రస్తుతం తన కూతురు సారా కూడా తండ్రిని అన్ ఫాలో చేయడంతో ఈ పుకార్లు నిజమని అందరూ నమ్ముతున్నారు. పైగా నీలాంజన ఇటీవల తన కూతుర్లు సారా, జరా, సోదరి చందనాతో కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేసి.. వీరే నా బలం, బలగం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక దీన్ని బట్టి చూస్తే నిజంగానే జిషూ సేమ్ గుప్తా తన భార్య నుంచి వేరు పడుతున్నారా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో కొంతమంది ఇది కేవలం రూమర్ మాత్రమే అంటూ కామెంట్లు చేయగా, మరి కొంతమంది ఆల్రెడీ విడిపోయారు అంటూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వీరిద్దరూ విడిపోతున్నారు అని తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు