Tripti dimri: పెళ్లికి సిద్ధమైన బోల్డ్ బ్యూటీ.. డబ్బున్నోడినే పట్టేసిందిగా..?

Tripti dimri.. రణబీర్ కపూర్ హీరోగా , రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం యానిమల్. ఈ సినిమాలో హాట్ బ్యూటీగా నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్న బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి, ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటీవలే బ్యాడ్ న్యూస్ అనే సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్న నేపథ్యంలో ఈమె క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తన అందచందాలతో నేషనల్ స్థాయి బిరుదును సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Tripti dimri: Bold beauty who is ready for marriage.. Does she care about money..?
Tripti dimri: Bold beauty who is ready for marriage.. Does she care about money..?

పెళ్లి పీటలెక్కనున్న యానిమల్ బ్యూటీ..

ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో భాగంగానే ఈమె తన అభిమానుల గుండెలను బ్రేక్ చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఒక అబ్బాయిని ప్రేమించిందని, చాలాకాలం పాటు వీరు రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ఆయన మరెవరో కాదు ప్రముఖ బిజినెస్ మాన్ సామ్ మర్చంట్. ఈయనకి చాలా మంది సినీ సెలబ్రిటీలతో మంచి సంబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాల క్రితమే సామ్ మర్చంట్ తో ఈమె ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చాలా రోజుల నుండి వీరిద్దరూ పార్టీలు, లొకేషన్స్, ఫంక్షన్ లు అంటూ ఎంజాయ్ చేస్తూ తమ మధ్య ఉన్న బంధాన్ని రివీల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

డబ్బున్నోడినే పట్టేసింది అంటూ

అంతేకాదు పబ్లిక్ గా కూడా ఈమధ్య సామ్ మర్చంట్ తో కలిసి ఈమె ముంబై వీధుల్లో చాలాసార్లు మీడియా కంట పడింది. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు ఈ విషయం తెలిసి నెటిజన్స్ డబ్బున్నోడినే పట్టేసిందిగా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వీరిద్దరికీ సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

యానిమల్ తోనే గుర్తింపు..

ఈమె కెరియర్ విషయానికి వస్తే, 2017 లో వచ్చిన కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ అనే సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత లైలా మజ్ను సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత బుల్బుల్, కళ వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. అయితే ఏ సినిమా కూడా ఈమెకు మంచి గుర్తింపును అందించలేదు. పైగా 2021లో ఫోర్బ్స్ ఆసియా థర్టీ అండర్ 30 జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. అంతేకాదు రెడిఫ్ డాట్ కామ్ 2020లో ఉత్తమ నటి జాబితాలో 8వ స్థానం సంపాదించుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ లిస్ట్ ఆఫ్ 2020 లో కూడా 20 వ స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ అయితే ఇవేవీ కూడా ఈమెకు పెద్ద గుర్తింపును అందివ్వలేదు. కానీ ఎప్పుడైతే యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో నటించిందో.. అప్పుడు ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు