SSMB28 కోసం రూట్ మార్చుతున్న త్రివిక్రమ్..?

ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ సినిమా అంటే ఓ పెద్ద కుటుంబం, పెద్ద ఆఫీసు, సీఈఓ ల గోల.. ఇలా సాగుతున్నాయి. ‘అరవింద సమేత’ తో కొంచెం రూటు మార్చాడు అని అంతా సంతోషించే లోపే మళ్ళీ ‘అల వైకుంఠపురములో’ తో అదే ట్రాక్ ఎక్కి.. త్రివిక్రమ్ ఇంకా ఈ లైన్లు ఎన్నాళ్ళు పట్టుకుని తిరుగుతాడు అంటూ నిరాశ చెందేలా చేశాడు.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. భారీ వసూళ్లు రాబట్టింది. కానీ త్రివిక్రమ్ రూటు మార్చాలి అని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు అంటే అది ఎంత బోర్ కొట్టించేసిన ఫార్ములానో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి కాస్త ఫార్ములా మారుస్తున్నాడట.

అలా అని ‘ఖలేజా’ రూట్లోకి వెళ్లిపోవడం లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్లో హీరోకి విలేజ్ బ్యాక్ డ్రాప్ టచ్ ఇచ్చి కాస్త మాస్ గా చూపించబోతున్నాడట. ఈ సినిమాలో కూడా హీరో విలేజ్ నుండీ సిటీలో ఉన్న వాళ్ళ తండ్రి ఫ్రెండ్ ఇంటికి వెళ్లడం, అక్కడ అతని కోసం హీరోయిన్ మరియు అతని మరదలు ఉండడం.. అక్కడ జరిగే, ఫన్, ఎమోషన్స్ ఇలా సాగుతుందట.

- Advertisement -

అంతేకాకుండా కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని భోగట్టా. ఏమైతేనేం మనం.. వింటేజ్ త్రివిక్రమ్ ను చూడగలిగితే చాలు..! ఇక పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు