Varun Sandesh : దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేరళ వయనాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడంతో కొండ చర్యలు విరిగిపడటంతో కొన్ని ఊర్లే కొట్టుకుపోయాయి. ఎన్ని వందల మంది ప్రాణాలను కోల్పాయారు. ఆ ప్రాంతంలో నిరాశ్రయులులైన వారిని ఆదుకోవడం కోసం సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. భారీ విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా హీరో వరుణ్ సందేశ్ భారీ విరాళాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపినట్లు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.
వయనాడ్ లో వరద బాధితులను ఆదుకోవడం కోసం సినీ ప్రముఖులు పెద్ద మనసు చాటుకుంటూ ముందుకొస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తీలు కలిసి మొత్తం 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. కేరళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా 10 లక్షలు మలయాళ స్టార్ ముమ్మట్టి 15 లక్షలు తమిళ పరిశ్రమ నుంచి కమల్ హాసన్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న 10 లక్షలు ప్రకటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 25 లక్షలు, రామ్ చరణ్ , చిరంజీవి కలిపి కోటిరూపాయలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రెండు కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇప్పుడు హీరో వరుణ్ తేజ్ కూడా 5 కోట్ల సాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్స్ పంపినట్లు తెలుస్తుంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోనే 2 కోట్లు ఇస్తే వరుణ్ 5 కోట్లు ఎలా ఇచ్చాడు. అతనికి పెద్దగా సినిమాలు కూడా లేదు కదా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే వరుణ్ సందేశ్ రెస్పాండ్ అవ్వాల్సిందే. రీసెంట్ గా విరాజీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..