Veera Simha Reddy: వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్?

బాలకృష్ణ-శ్రుతిహాసన్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా కనిపించనున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈ నెల 6న ఒంగోలులోని ఏబీఎన్ గ్రౌండ్స్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని తలపెట్టారు. కానీ తాజాగా ఏపీ పోలీసులు వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చారు.

ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించారు. ఒంగోలు నగరంలో ఈవెంట్ నిర్వహించడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగే అవకాశం ఉందని, పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రత్యామ్నాయ వేదిక కోసం వీరసింహారెడ్డి యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాదు, ఒంగోలు నగరం బయట ఈవెంట్ నిర్వహించుకోవాలని సినిమా యూనిట్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు అని సమాచారం.

ప్రత్యామ్నాయంగా నగర శివారు లోని అర్జున్ ఇన్ఫ్రా వెంచర్ లో వేదిక ఖరారు చేసేందుకు వీరసింహరెడ్డి మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తోందట. అర్జున్ ఇన్ఫ్రా వెంచర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే, ఆ వేదిక కాకపోతే, వరంగల్ లో నిర్వహిస్తే, ఎలా ఉంటుందనే దానిపై కూడా వీరసింహారెడ్డి చిత్ర యూనిట్‌ చర్చలు చేస్తుందని సమాచారం. అన్ని ఓకే అనుకుంటే, వరంగల్ లో నిర్వహించేందుకు ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు