Vijay Sethupathi Next : కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం మహారాజా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ కొత్త మూవీలో సేతుపతితో నిత్యా మీనన్ రొమాన్స్ చేయబోతోందని తెలుస్తోంది. కానీ సినిమాకు అసలు సమస్య డైరెక్టరే అంటున్నారు.
అసలు డైరెక్టర్ సెట్ అవుతాడా?
తమిళ సినీ ప్రపంచంలో స్వతంత్రంగా ఎదిగి నేడు కోలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరిగా స్టార్ డం సంపాదించుకున్న అతి కొద్దిమంది నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల విడుదలైన ఆయన సినిమా `మహారాజా`భారీ హిట్గా నిలిచింది. దర్శకుడు నిథిలన్ సామినాథన్ దర్శకత్వంలో నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజా అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్ప్లే, నటీనటుల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా రూ.90 కోట్ల వరకు వసూలు చేసింది. అలాగే ప్రస్తుతం విజయ్ సేతుపతిలో లైనప్ లో మిష్కిన్ దర్శకత్వంలో రైలు అనే సినిమా ఉంది. ఈ క్రమంలోనే సేతుపతి మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు.
2009లో విమల్ హీరోగా తెరకెక్కిన “బసంగ” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యి, తన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకున్న దర్శకుడు పాండిరాజ్తో విజయ్ సేతుపతి త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న “రైలు” చిత్రంలో నటిస్తుండడంతో, ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక పాండిరాజ్ సినిమాని స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇది విజయ్ సేతుపతి కెరీర్లో 52వ సినిమా కాగా, ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే నిత్యా మీనన్ తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆ సినిమా పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. అయితే పాండిరాజ్ కథ జనాలకు కనెక్ట్ అవుతుందా? సేతుపతికి సెట్ అవుతుందా అనేది అభిమానుల ప్రశ్న.
డైరెక్టర్ సమస్య ఏంటంటే?
కోలీవుడ్ ప్రముఖ దర్శకులలో పాండిరాజ్ కూడా ఒకరు. దీంతో ఆయనతో సేతుపతి మూవీ అనగానే అంచనాలు పెరిగాయి. కానీ కొత్త అనుమానాలు కూడా పుట్టుకొచ్చాయి. పాండిరాజ్ గతంలో సూర్య నటించిన నీదిరుం వతాండవన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అలాగే ఎక్కువగా పల్లెటూరి కథలనే ఎంచుకుని దర్శకత్వం వహిస్తున్న పాండిరాజ్ సేతుపతికి హిట్ ఇస్తాడా? అనే డౌట్ తో ఉన్నారు ఆయన ఫ్యాన్స్. కానీ మరోవైపు సేతుపతి మంచి ప్రాధాన్యత ఉన్న కథనే ఎందుకుంటాడు అని సరిపెట్టుకుంటున్నారు.
సేతుపతి – నిత్యా జోడి రిపీట్
ఇంతకు ముందు సేతుపతి, నిత్యా మలయాళ చిత్రం 19 (1) (A)లో జంటగా నటించారు. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరూ కలిసి మరోసారి సినిమా చేయబోతున్నారనే వార్తతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనుందని సమాచారం.