Vishwambhara : విశ్వంభరలో వేలు పెడుతున్న చిరు… మరో ఆచార్య కాకుంటే అదే చాలు అంటూ కామెంట్స్

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఇంకా ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉంది. తాజాగా ఈ సినిమాలో చిరు వేలు పెడుతున్నాడు అంటూ ఓ వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీంతో విశ్వంభర మరో ఆచార్య కాకపోతే చాలు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

విశ్వంభరలో మెగాస్టార్ ఇన్వాల్వ్మెంట్

మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషల్ ఫాంటసీ డ్రామా విశ్వంభర. ఈ సినిమాలో త్రిష తో పాటు యంగ్ కన్నడ భామ ఆశికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి తదితర హీరోయిన్లు కీలకపాత్రను పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. దానికి తగ్గట్టుగానే చిత్ర బృందం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. కాగా ప్రస్తుతం విశ్వంభర మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే బెంగళూరులో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి, డైరెక్టర్ వశిష్ట, గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు ఇతర కోరస్ గాయకులు ఈ మ్యూజిక్ సిట్టింగ్ సెషన్ లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రత్యేకమైన సినిమాకు సంబంధించిన ఆల్బమ్ మరపురానిదిగా ఉండాలనే ఉద్దేశంతో చిరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మ్యూజిక్ టీంతో కలిసి చిరు దిగిన పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కానీ చిరు ప్రత్యేక సద తీసుకోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

- Advertisement -

గతంలో ఇలాగే ఆచార్య విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యాడని, అందుకే స్టోరీ నాశనం అయిందని కామెంట్స్ వినిపించాయి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఆచార్య కొరటాల జీవితంలో మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అలాగే మెగా తండ్రి కొడుకులకు కూడా. కానీ మెగా అభిమానులు మూవీ ప్లాఫ్ కావడానికి రీజన్ కొరటాల అంటూ బ్లేమ్ మొత్తం డైరెక్టర్ మీదే వేశారు. పైగా మెగాస్టార్ కూడా ఒకానొక సందర్భంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి ఈసారి విశ్వంభర విషయంలో చిరు ఇన్వాల్వ్మెంట్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.

మూడు దశాబ్దాల తర్వాత కాంబో రిపీట్…

మెగాస్టార్ చిరంజీవి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కాంబినేషన్ మూడు దశాబ్దల తర్వాత విశ్వంభరతో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్పీ పరశురాం వంటి సినిమాల మ్యూజిక్ ఆల్బమ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇక ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఆస్కార్ అవార్డును అందుకున్న కీరవాణి, పద్మ విభూషణ్ అందుకున్న చిరు కాంబినేషన్లో విశ్వంభర రాబోతుండడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు