Double ismart: ఇదే ఎందుకు? ఆ సినిమాలా తీయొచ్చుగా అంటున్న పూరి ఫ్యాన్స్.?

టాలీవుడ్ లో హీరోని కొత్తగా ఎలివేట్ చేసే దర్శకుల్లో ఒకరు “పూరి జగన్నాథ్”. ఎలాంటి హీరోనైనా సరే తన మార్క్ మేనరిజం తో డీసెంట్ ఫ్యామిలీ హీరోలని కూడా ఊరమాస్ గా చూపించే అద్భుతమైన డైరెక్టర్ ఈయన. అయితే గత కొన్నాళ్లుగా పూరి సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. నిజం చెప్పాలంటే గత పదేళ్లలో పూరి జగన్నాథ్ నుండి వచ్చింది రెండు హిట్ సినిమాలు మాత్రమే. అందులో ఒకటి ఇస్మార్ట్ శంకర్.

2019 లో విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలియంది కాదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సిక్వెల్ ని కూడా తీస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ పేరుతో తెరకెక్కబోయే ఆ చిత్రం పూజాకార్యక్రమాలను కూడా జరుపుకోగా, అతి త్వరలోనే రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటినుండీ సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ నెట్టింట తెగ రచ్చ చేస్తున్నారు.

అదేంటంటే పూరిజగన్నాథ్ తీసిన సినిమాల్లో చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఉన్న సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు వేరే ఉంటాయి. ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా, రొటీన్ కంటెంట్ ఉన్న సినిమా. పైగా ఆ సినిమాలో కథనం కూడా లాజిక్ లెస్ గా ఉంటుంది. కేవలం అందులో పాటల వల్లే, ఎక్కువగా జనాల్లోకి వెళ్లిందని అందరికి తెలుసు. మరి అలాంటప్పుడు ఈ సినిమాకే సీక్వెల్ తీయాల్సిన అవసరమేంటని పూరి ఫ్యాన్స్ చర్చిస్తున్నారు.

- Advertisement -

డబల్ ఇస్మార్ట్ బదులు, పూరి జగన్నాథ్ స్పెషల్ బ్లాక్ బస్టర్ సినిమా “బిజినెస్ మెన్” కి సిక్వెల్ తీయాల్సింది అంటున్నారు. ఇది కాకపోయినా కనీసం రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో గోలీమార్ లాంటి సీక్వెల్స్ తీస్తే బాగుటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు