Gopichand: రిస్క్ చేస్తున్న గోపీచంద్ – ఈసారైనా హిట్ కొడతాడా..?

కెరీర్ ఆరంభంలో తన విభిన్న నటనతో హీరోగా, విలన్ గా మెప్పించి మంచి హిట్స్ అందుకున్న హీరో గోపీచంద్. అయితే గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. మధ్యలో గౌతమ్ నంద వంటి మంచి కథతో వచ్చినప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయాడు గోపీచంద్. ప్రస్తుతం పీపుల్స్ మీడియా నిర్మాణంలో శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం రామబాణం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో కొన్ని ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. రామబాణం పై పీపుల్స్ మీడియా ఏకంగా 50కోట్ల బడ్జెట్ పెట్టిందట. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం.

ఫామ్ లో లేని గోపీచంద్ మార్కెట్ రేంజ్ తెలిసి కూడా ఇంత రిస్క్ ఎలా తీసుకున్నారు అందరి ప్రశ్న. ఇదిలా ఉంటే దర్శకుడు శ్రీవాస్ మాత్రం అది వడ్డీల పెరిగిన ఖర్చు మాత్రమే అని, కథకు ఎంత వరకు అవసరమో అంత బడ్జెట్ పెట్టమని చెప్పుకొస్తున్నారు. మరో పక్క ఇండస్ట్రీ వర్గాల వర్షన్ మరోలా ఉంది. కరోనా తర్వాత సినిమా బడ్జెట్ తగ్గించటం ఎలా అన్న అంశంపై ఏర్పాటు చేసిన మీటింగ్ లో తన సలహాలతో స్పీచ్ దంచికొట్టిన శ్రీవాస్ ఇప్పుడు మితి మీరు బడ్జెట్ పెట్టించటం ఏంటని నవ్వుకుంటున్నారు.

ఈ సినిమా విషయంలో కనిపిస్తున్న ఒకే ఒక్క పాజిటివ్ అంశం ఏంటంటే ఇప్పటికే 30కోట్ల వరకు నాన్ థియాట్రికల్ బిజినెస్ జరగటం. అయితే  మిగతా 20కోట్లు కేవలం థియటర్ల నుండి మాత్రమే రావాలి. అలా అయితే గాని బయ్యర్లు సేఫ్ జోన్ లో ఉంటారు. మరి పీపుల్స్ మీడియా చేస్తున్న రిస్క్ ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి. ఒకవేళ అదే గనక జరిగితే గోపీచంద్ ఫేట్ మారినట్లే అని చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు