Sai Durga Tej : ఒకటి కాదు ఏకంగా 120 కోట్ల బడ్జెట్… మెగా మేనల్లుడు హ్యాండిల్ చేస్తాడా..?

Sai Durga Tej : టాలీవుడ్ లో మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ చిత్రాలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. లాస్ట్ ఇయర్ తన పేరును సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య ఆక్సిడెంట్ కారణంగా సినిమాలకి కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చిన సాయి దుర్గా తేజ్, లాస్ట్ ఇయర్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించగా, పవర్ స్టార్ తో కలిసి బ్రో సినిమాచేసి ప్రేక్షకులని అలరించాడు. అయితే ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు. బ్రో వచ్చి కూడా దాదాపు ఏడాది కావస్తుంది. ఇక మధ్యలో సంపత్ నందితో గాంజా శంకర్ స్టార్ట్ చేయగా, మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ మొదలవుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో సాయి దుర్గా తేజ్ నుండి రాబోయే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అయితే హనుమాన్ చిత్ర నిర్మాతలు సాయి ధరమ్ తేజ్ తో ఓ చిత్రం చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ గురించి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Will Sai Durga Tej next project open with a budget of 120 crores?

పీరియాడిక్ మూవీగా సాయి దుర్గా తేజ్ మూవీ…

ఇక సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) హీరోగా త్వరలో ఓ పీరియాడిక్ యాక్షన్ మూవీ తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ ఇయర్ హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. సాయి దుర్గా తేజ్ 18వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తుండగా, ఇంకా టైటిల్ పెట్టని ఈ మూవీని రోహిత్ కెపీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ మధ్య ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ పోస్టర్ లో ఎడారి లాంటి భూమిలో ఒక పచ్చని చెట్టు ఉండడం, అలాగే దాని చుట్టూ ల్యాండ్ మైన్‌లు పేర్చి ఉన్న దృశ్యం అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఈ పోస్టర్ బట్టి ఈ సినిమా ఒక వార్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందని సమాచారం.

- Advertisement -

ఏకంగా 120 కోట్ల బడ్జెట్.. హ్యాండిల్ చేస్తాడా?

అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సాయి దుర్గా తేజ్ నటించబోయే ఈ సినిమాను ఏకంగా 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 125 కోట్ల పెట్టుబడి అంటే సాయి ధరమ్ తేజ్ హ్యాండిల్ చేయగలడా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ మార్కెట్ ఇప్పటివరకు 50 కోట్లు కూడా దాటలేదు. అంతే కాదు తన కెరీర్ లో హై బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాకు కూడా యాభై కోట్లకి మించి బడ్జెట్ పెట్టలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ అంటే ఏ నమ్మకంతో పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఇంత బడ్జెట్ పెడుతున్నారని అనుకోవచ్చు. కానీ కంటెంట్ విషయంలో అటుఇటు అయితే నష్టపోయేది నిర్మాతలు మాత్రమే. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో, సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు