‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ద్వారా డైరెక్టర్ గా మారిన రైటర్ వక్కంతం వంశీ, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల నెక్స్ట్ సినిమా ఛాన్స్ రావటానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం నితిన్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న వంశీ, ఇటీవల విడుదలైన ఏజెంట్ సినిమాకి కథ అందించారు. అయితే ఆ సినిమా వేరు వేరు కారణాల వల్ల చాలా సార్లు వాయిదా పడుతూ, పలు మార్లు రీషూట్ కూడా చేయటం వల్ల డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు నితిన్ సినిమా విషయంలో కూడా వక్కంతం వంశీ అదే తప్పుని రిపీట్ చేస్తున్నాడని అనిపిస్తుంది.
ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన వంశీ, నితిన్ ల సినిమా 25రోజుల షూటింగ్ పూర్తీ చేసుకుంది. అవుట్ ఫుట్ ఆశించిన స్థాయిలో రాకపోవటం వల్ల రీషూట్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడట డైరెక్టర్ వంశీ. ఈ నేపథ్యంలో ఏజెంట్ సినిమా లాగానే ఈ సినిమా కూడా డిజాస్టర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏజెంట్ సినిమా విషయంలో జరిగిన పొరపాటుని వంశీ ఇంకా గ్రహించినట్లు లేడని అంటున్నారు.
రీషూట్ చేసినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అవ్వాలని లేదు కానీ, ఏజెంట్ సహా గతంలో రీషూట్ జరిగిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవ్వటం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. 25రోజుల షూట్ పూర్తయ్యే వరకు అవుట్ ఫుట్ చూసుకోకపోవటం ముమ్మాటికీ డైరెక్టర్ తప్పే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటు నితిన్ కి, వక్కంతం వంశీకి హిట్ కీలకమైన దశలో వస్తున్న ఈ సినిమా మేరకు అలరిస్తుందో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News