Kareena Kapoor : అసత్య ప్రచారాలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి తెలియని వారుండరు. చాలా సంవత్సరాలు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ ను 2012లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేసింది. కానీ, గత నాలుగేళ్ల నుంచి తక్కువగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ 41 ఏళ్ల బ్యూటీ. సినిమా ఆగస్టు 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది.

కాగ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో కరీనా కపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య కాలంలో తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని తెలిపింది. బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న రామయాణం సినిమాలో తాను సీత పాత్ర చేస్తున్నాని, దానికి తాను, రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేశానని వార్తలు వస్తున్నాయని అన్నారు. ఆ సినిమా బృందం నుంచి తనకు అసలు ఆఫరే రాలేదని స్పష్టం చేశారు.

అలాంటి సమయంలో తాను ఎలా రూ. 12 కోట్లు డిమాండ్ చేస్తానని కరీనా కపూర్ తెలిపారు. నిజాలు తెలియకుండానే సోషల్ మీడియాలో తన గురించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కరీనా మండిపడ్డారు. మాట్లాడుకోవడానికి ఒకటి ఉండాలని, అందుకే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని అన్నారు. కాగా, సీత పాత్రపై, రెమ్యూనరేషన్ డిమాండ్ పై స్వయంగా కరీనా కపూర్ క్లారిటీ ఇవ్వడంతో చాలా రోజుల నుంచి వస్తున్న పుకార్లకు బ్రేకులు పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు