Jhanvi Kapoor : జాన్వీకి ఇదేం పోయేకాలం… బాయ్ ఫ్రెండ్ పై ఇంత అనుమానమా?

Janhvi Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ పర్సనల్ లైఫ్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం తెలిసిన నెటిజెన్లు జాన్వీకి బాయ్ ఫ్రెండ్ పై ఇంత అనుమానం ఎందుకు? అని అంటున్నారు.

బాయ్ ఫ్రెండ్ పై అనుమానమా ?

ప్రస్తుతం జాన్వి మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే మూవీలో నటిస్తోంది. రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వి హీరోయిన్. మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ మే 31న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లలో హడావిడి చేస్తోంది జాన్వి. అందులో భాగంగానే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో జాన్వి తనకు బాయ్ ఫ్రెండ్ ఫోన్ ను చెక్ చేసే అలవాటు ఉందని వెల్లడించింది.

Janhvi Kapoor breaks silence on rumoured beau Shikhar Pahariya

- Advertisement -

ఇంటర్వ్యూలో ఓ అభిమాని బాయ్ ఫ్రెండ్ ఫోను చెక్ చేస్తారా? అని అడగ్గా స్పందించిన జాన్వి.. ఇది రెడ్ ఫ్లాగ్ అని నాకు తెలుసు. కానీ నేను ఇప్పటికీ తన ఫోన్ ని చెక్ చేస్తాను అని చెప్పింది. దీంతో మరో అభిమాని మరి బాయ్ ఫ్రెండ్స్ తమ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ ని చెక్ చేయొచ్చా? అని ప్రశ్నించారు. వెంటనే జాన్వి లేదు మీరు మమ్మల్ని నమ్మట్లేదా? అని ప్రశ్నించడంతో అందరూ నవ్వేశారు. కానీ కొంతమంది మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫోన్ ని చెక్ చేసినప్పుడు, అబ్బాయి కూడా అమ్మాయిల ఫోన్ ని చెక్ చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.

సపోర్ట్ సిస్టమ్ అతనే

జాన్వీ కపూర్ ఇటీవల శిఖర్ పహారియాతో డేటింగ్‌ను ఒప్పుకుంది. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో జాన్వీని ఆమె ‘సపోర్ట్ సిస్టమ్’ ఎవరు అని అడిగారు. అప్పుడు ఆమె శిఖర్ పేరు చెప్పింది. “అతను (శిఖర్ పహారియా) నా జీవితంలో 15-16 ఏళ్ల నుంచి ఉన్నాడు. నా కలలు ఎప్పటికీ అతని కలలు. అలాగే అతని కలలు నా కలలు అని నేను అనుకుంటున్నాను. మేము చాలా సన్నిహితంగా ఉన్నాము. మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నాము. అలాగే సపోర్ట్ చేసుకుంటున్నాము” అని జాన్వి చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అఫిషియల్ గా తన లవ్ గురించి బయట పెట్టినట్టు అయ్యింది.

శిఖర్ పహాడియా ఎవరు?

శిఖర్ పహాడియా స్మృతి షిండే కుమారుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. స్మృతి షిండే సుశీల్ కుమార్ షిండే కుమార్తె. జాన్వీ, శిఖర్ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. కాబట్టి ఇద్దరికీ స్కూల్‌ నుంచే ఒకరికి ఒకరు తెలుసు.

సౌత్ లో జాన్వీ బిజీ

జాన్వీ ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర, రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీతో పాటు మరో సౌత్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు