Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తో పాటు ఆయన వారసులు కూడా తరచుగా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తారు. ఇక షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇండస్ట్రీలోకి రాకముందే సోషల్ మీడియాలో పాపులర్. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ సెలబ్రిటీ తండ్రీ కూతుర్ల జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. అందులో భాగంగానే సుహానా ఖాన్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. మరి సుహానా చదువుకు షారూఖ్ ఎంత ఖర్చు చేశాడో ఇప్పుడు చూద్దాం.
సుహాన స్కూల్ ఫీజు
షారూఖ్ తన పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన తన పిల్లల చదువు కోసం ఉత్తమ పాఠశాలలు, కళాశాలలను సెలెక్ట్ చేసుకోవడమే అందుకు నిదర్శనం. బాలీవుడ్లోని ఇతర స్టార్కిడ్ల మాదిరిగానే సుహానా కూడా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుంది.
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ యానువల్ ఫీజు దాదాపు 70 వేల రూపాయలు. ఈ స్కూల్ లో IGCSE సిలబస్ విద్యార్థులకు ప్రత్యేక ఫీజు ఉంటుందని సమాచారం. మొత్తం కలుపుకుని ఈ స్కూల్ లో యానువల్ ఫీజు 5 లక్షల 90 వేల రూపాయలు. అంబానీ స్కూల్లో చదివిన తర్వాత సుహానా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లింది.
లండన్ లో పై చదువులు
సుహానా తన తదుపరి విద్యను లండన్లోని ఆర్డింగ్లీ కాలేజీలో చేసింది. ఈ కళాశాల బోర్డింగ్ ఫీజు ఒక్కో టర్మ్కు 1400 పౌండ్లు అంటే సుమారు రూ.14,51,177.
న్యూయార్క్ లో ఆర్ట్స్..
2019లో సుహానా న్యూయార్క్లోని టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో డ్రామా నేర్చుకోవడం ప్రారంభించింది. ఈ కళాశాలలో మూడేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సు ఉంది. కాబట్టి మొదటి సంవత్సరం ఫీజు 2 నుండి 5 వేల డాలర్లు అంటే దాదాపు 17 లక్షల రూపాయలు. టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ రెండో సంవత్సరం ఫీజు రూ.12,50,085. మూడో సంవత్సరం ఫీజు 15 వేల డాలర్లు. అలా దాదాపు 63 లక్షల రూపాయలను సుహానా చదువుకు ఖర్చు చేశారు.
సుహాన మూవీ ఎంట్రీ
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్, గౌరీ దంపతుల కుమార్తె సుహానా ఖాన్. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్కిడ్లలో ఎక్కువగా మాట్లాడుకునే వారి లిస్ట్ లో సుహాన కూడా ఒకరు. ఇటీవలే ‘ది ఆర్చీస్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. సుహానా త్వరలో షారుక్తో ‘కింగ్’ సినిమాలో నటించనుందని టాక్. అయితే ఇండస్ట్రీలోకి రాకముందే సుహానా సోషల్ మీడియాలో పాపులర్.
మొత్తానికి చదువును పూర్తి చేసిన సుహాన ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉంది. మరోవైపు షారుఖ్ పెద్ద కొడుకు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక షారుఖ్ గత ఏడాది డంకీ మూవీతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఐపీఎల్ 2024లో బిజీ అయ్యాడు. కొలకత్తా నైట్ రైడర్స్ టీం యజమాని అయిన షారుఖ్ తన జట్టు ఫైనల్ లో విజయం సాధించడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.