26YearsFor ChoodalaniVundi : సరికొత్త ట్రెండ్ సృష్టించిన మెగాస్టార్.. అప్పటివరకు ఎవరూ చేయలేని సాహసం చేసిన చిరు..

26YearsFor ChoodalaniVundi : మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో “చూడాలని ఉంది” (ChoodalaniVundi) సినిమా కూడా ఒకటి. చిరుని సరికొత్తగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన ఆ చిత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్స్ కి శ్రీకారం చుట్టింది. చిరు మాస్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న టైం లో సడన్ గా ఒక లవ్ స్టోరీ తో వస్తాడని అప్పటికీ ఎవ్వరూ ఊహించలేదు. క్లాస్ & మాస్ టచ్ తో వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటివరకు గుణశేఖర్ (Gunasekhar) అంటే పిల్లల సినిమా తీసే సాధారణ డైరెక్టర్ అనుకున్నారు కానీ, ఈ రేంజ్ మాస్ సినిమా దించుతాడని అనుకోలేదు అనుకోలేదు. గుణశేఖర్ అంటే భారీ సెట్లకు పెట్టింది పేరని అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇక్కడి నుండే.

26YearsFor Chiranjeevi's ChoodalaniVundi Movie

సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన చిరు…

ఇక ‘చూడాలని ఉంది’ సినిమా మొదలు పెట్టినపుడు చిన్న డైరెక్టర్ తో చిరంజీవి (Chiranjeevi) ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడని అందరూ కామెంట్స్ చేసారు. పైగా అప్పటికే హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా సినిమాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. అంతకు మించి రామ్ గోపాల్ వర్మ, సింగీతం శ్రీనివాసరావు లాంటి స్టార్ డైరెక్టర్ లతో మొదలు పెట్టిన సినిమాలు ఆగిపోయాయి. పైగా సినిమా మొదలెట్టాక బడ్జెట్ కూడా కమర్షియల్ సినిమాలని మించి గుణశేఖర్ చెప్పే సరికి నిర్మాత అశ్వినిదత్ కూడా షాక్ అయ్యాడట. ఏది ఏమైనా కథని నమ్మి చిత్ర యూనిట్ సినిమా మొదలుపెట్టారు. అయితే సినిమాలో హైలెట్ గా నిలిచే సీన్స్ లో కలకత్తా అపార్ట్మెంట్ సెట్ ఒకటి. ఈ సెట్ కోసం ఆ రోజుల్లోనే కోటి రూపాయల బడ్జెట్ అయింది. ఈ విషయం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది.

- Advertisement -

ధైర్యం చేసిన చిరు.. కథని నమ్మిన అశ్వినిదత్..

అయితే ఆ రోజుల్లోనే భారీ సెట్టింగులతో అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా, సినిమాలో మొదటిసారి ఎస్పీ బాలు కాకుండా బాలీవుడ్ నుండి ఉదిత్ నారాయణ్ (Udit narayan) అనే కొత్త సింగర్ ని పట్టుకొచ్చారు. అప్పటివరకు చిరు బాడీ లాంగ్వేజ్ కి బాలు తప్ప ఎవ్వరూ సూట్ కారని, ఆ సింగర్ తో వద్దని ఇండస్ట్రీ ప్రముఖులు చెప్పగా, మణిశర్మ, చిరు కాంప్రమైజ్ కాలేదు. క్యాసెట్లు రిలీజ్ చేసినపుడు కూడా మిశ్రమ స్పందన వినిపించింది. కానీ మొత్తానికి సినిమా 1998 ఆగష్టు 27న విడుదలైంది. ఇక రిలీజ్ తర్వాత థియేటర్లలో పాటలతో హోరెత్తిపోయింది. అన్నిటికంటే ఉదిత్ నారాయణ్ పాడిన “రామ్మా చిలకమ్మా” సాంగ్ ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక అప్పట్లో చూడాలని ఉంది సినిమా హైలెట్స్ లో ఒకటి రైల్వేస్టేషన్ లో లవ్ ట్రాక్ సీన్. హీరో, హీరోయిన్లకి ఒక్క డైలాగ్ లేకుండా చూపులతోనే నడిచే లవ్ సీన్ ఏకంగా పది నిమిషాల పాటు ఉంటుంది. ఇది అసలు వర్కౌట్ కాదని అశ్వినీదత్ (Aswini Dutt) అన్నారట. కానీ సినిమా హైలెట్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. సౌందర్య, అంజలా జవేరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించాడు. ఆ రోజుల్లో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఏకంగా 63 కేంద్రాల్లో వంద రోజులు జరుపుకోగా 15 కోట్ల షేర్ వసూలు చేసి, కొద్దిలో ఇండస్ట్రీ రికార్డ్ మిస్ అయింది.

ఈ నలుగురికి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా…

చూడాలని ఉంది సినిమాతో మణిశర్మ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. అలాగే ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఉదిత్ నారాయణ్ స్టార్ సింగర్ అయి, తెలుగులో అందరు హీరోలకి మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. చూడాలని ఉంది సినిమాతోనే విలన్ గా ప్రకాష్ రాజ్ వరుస అవకాశాలు అందుకున్నాడు. అన్నిటికి మించి గుణశేఖర్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇంతమంది కెరీర్ కి బూస్టప్ ఇచ్చిన “చూడాలని ఉంది” సినిమా రిలీజ్ అయి నేటికీ (ఆగష్టు27) 26 వసంతాలు పూర్తి చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు