Trisha: త్రిష వల్ల నా జీవితం నాశనం…నిర్మాత కామెంట్స్ వైరల్!

Trisha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జోడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. అలా తమిళంలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిష తెలుగులో నీ మనసు నాకు తెలుసు చిత్రంతో ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది. అనంతరం ప్రభాస్ (Prabhas) సరసన హీరోయిన్గా వర్షం సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో త్రిష రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

వర్షం సినిమా అనంతరం త్రిషకు విపరీతంగా సినిమా అవకాశాలు వచ్చాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా నిలిచింది. ఇక గత కొంతకాలం నుంచి తెలుగులో సినిమాలు చేయని త్రిష కొద్దిరోజుల క్రితం పొన్నియిన్ సెల్వన్ సిరీస్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కు మించిన అందంతో త్రిష ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉండగా….తాజాగా నటి త్రిషపై నాయకి నిర్మాత గిరిధర్ సంచలన కామెంట్స్ చేశారు. త్రిషతో (Trisha) ఓ సినిమా తీయాలని అనుకున్నాను.

థ్రిల్లర్ సినిమా చేయమని అడిగితే త్రిష చేయనని చెప్పింది. ఆ సమయంలో డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి (Govardhan reddy) ఓ కథతో వచ్చారు. అదే నాయకి స్టోరీ. ఆ స్టోరీ విన్న వెంటనే త్రిష ఓకే చెప్పింది. కానీ ఈ సినిమా వల్ల నేను చాలా నష్టపోయానని నిర్మాత గిరిధర్ కామెంట్స్ చేశారు. నాయకి సినిమా వల్ల నాకు, త్రిషకు (Trisha) మధ్య ఉన్న రిలేషన్ చెడిపోయింది. కేవలం అది డైరెక్టర్ వల్లనే అలా జరిగింది.

- Advertisement -

Does Trisha have such a bad habit?
సినిమా బడ్జెట్ 10 కోట్లు చేరిందని డైరెక్టర్ చెప్పాడు. కానీ ఇక్కడ అంత మ్యాటర్ లేకపోవడం. రెమ్యూనరేషన్ ప్రకారం చాలా తేడాలు వచ్చాయి. నేను తమిళ సాటిలైట్ రైట్స్ ఇద్దామనుకున్నా. త్రిష మాత్రం తనకు కోటి రూపాయలైనా రెమ్యూనరేషన్‌ ఇవ్వాలంటూ డిమాండ్ చేసిందని తెలిపారు. దీంతో నేను చాలా ఇబ్బంది పడ్డానని నిర్మాత గిరిధర్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీవర్గాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు