Vijay Thalapathy : మళ్లీ అదే పనిచేసిన విజయ్.. షాక్ అవుతున్న ఫ్యాన్.. !

Actor Vijay Thalapathy: తమిళ స్టార్ హీరోగా వెలుగు వెలిగిన విజయ్ దళపతి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విజయ్ తమిళ సినిమా టాప్ స్టార్ హీరోగా మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో కోట్లాదిమంది అభిమానుల మనసులను సంపాదించుకున్నాడు. విజయ్ సినిమాల కోసం తన అభిమానులు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాయి.

అందుకే విజయ్ ను బాక్సాఫీస్ కింగ్ అని కూడా పిలుస్తారు. ఇటీవలే విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని ప్రారంభించాడు. ఇక త్వరలోనే సినిమాలకు స్వస్తి చెప్పి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ తమిళనాడులో వెట్రి కజగం అనే పార్టీని స్థాపించాడు. ఇక విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలే తన టార్గెట్ అని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే విజయ్ తన మంచి మనసుని చాటుకున్నారు.

ఈ ఏడాది తమిళనాడులో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సన్మానించిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి చెందిన పదవ తరగతిలో ముగ్గురు టాపర్లు, ముగ్గురు ఇంటర్మీడియట్ టాపర్లకు విజయ్ సన్మానం చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ సన్మాన కార్యక్రమం జరిపించారు.

- Advertisement -

Actor Vijay bonds with school students in Chennai as he makes his first political move | Chennai News - Times of India
తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాల టెన్త్, ఇంటర్ టాప్ 3 లో నిలిచిన విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారిని సన్మానించారు అదేవిధంగా వారికి సర్టిఫికెట్లతో పాటు రివార్డులను కూడా అందజేశారు. ఇలాంటి మంచి పనితో విజయ్ ఎంతోమంది అభిమానుల మనసులను గెలుచుకున్నారు. విద్యార్థులను సన్మానించి తన మంచి మనసును చాటుకున్నారని తన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

https://x.com/ANI/status/1806563386605400472

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు