Adivi Sesh : యాక్షన్ మోడ్ లో డెకాయిట్ టీం.. ఆ ఇద్దరి మధ్య

Adivi Sesh : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన అడవి శేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత కొన్నాళ్లుగా ఈ హీరో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. పైగా రొటీన్ కథలు కాకుండా తనకి సెట్టయ్యే డిఫరెంట్ స్క్రిప్ట్ లని సెలెక్ట్ చేసుకుంటూ, ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. అయితే రెండేళ్ల కింద ‘మేజర్’ సినిమాతో పలకరించిన ఈ హీరో మళ్ళీ తెర ముందుకు రాలేదు. కాస్త గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ అయ్యాడు. ఒకేసారి రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నాడు అడవి శేష్. చేతిలో ఈ రెండూ కాక ఇంకా వేరే సినిమాలు కూడా ఉన్నా, ముందు సెట్స్ పై ఉన్న ప్రాజెక్టులు ఫినిష్ చేసి కొత్తవి సెలెక్ట్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు అడవి శేష్. ఇక ప్రస్తుతం అడివి శేష్ (గూఢచారి2) G2, మరియు ‘డెకాయిట్‌’ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు కూడా యాక్షన్ థ్రిల్లర్స్ కావడం విశేషం. ఇదిలా ఉండగా తాజాగా డెకాయిట్ కి సంబందించిన షూటింగ్ పై ఒక క్లారిటీ వచ్చింది.

Adivi Sesh 'Decoit' movie in shooting action scenes

డెకాయిట్ సెట్స్ లో హీరో హీరోయిన్లు…

ఇక తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ లో డెకాయిట్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో అడవి శేష్ తో పాటు హీరోయిన్ శృతి హాసన్ పాల్గొనడం జరిగింది. షూటింగ్ గ్యాప్ లో అడివి శేష్ తో శృతి హాసన్ క్లిక్ కనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక డకాయిట్ కోసం హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఇక హీరోయిన్‌గా నటిస్తున్న శ్రుతిహాసన్ ఈ షెడ్యూల్‌లో టీమ్‌తో జాయిన్ అయింది. ఈ షెడ్యూల్‌లో లీడ్ ఆర్టిస్టులపై యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శృతి హాసన్, శేష్‌తో సెల్ఫీని షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది. ఇక డకాయిట్ మూవీ ఇద్దరు మాజీ ప్రేమికుల కథ. వారు తమ జీవితాల్ని మార్చుకోవడం కోసం వరుస దోపిడీలు చేయాలని నిర్ణయించుకుంటారు. దీని కోసం మళ్లీ కలుస్తారు.

- Advertisement -

టీజర్ తో హైపెక్కించిన డెకాయిట్..

ఇక అడవి శేష్ (Adivi Sesh) శృతి హాసన్ నటిస్తున్న డెకాయిట్ మూవీ నుండి ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. యాక్షన్ సీన్ల మధ్య హీరోహీరోయిన్లు కలుసుకునే ఆ ఎమోషనల్ మూమెంట్ ని డైరెక్టర్ ట్విస్ట్స్ మధ్య ఎండ్ చేసి సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇక అడవి శేష్ నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అడివి శేష్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్ చేస్తోంది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఇక అడవిశేష్ గూఢచారి-2తో పాటు ఈ సినిమా షూటింగ్ ను సమాంతరంగా కొనసాగిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు