Aishwarya Lekshmi: మెగా హీరో సినిమాలో ఐశ్వర్య లక్ష్మి

Aishwarya Lekshmi: మెగా హీరోస్ లో సాయి దుర్గ తేజ్ ఒకరు. అయితే సాయి దుర్గ్ కెరియర్ లో హిట్ సినిమాలు కంటే కూడా డిజాస్టర్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. సాయి తేజ్ కి తన కెరియర్ లో డిజాస్టర్ సినిమాలు ఉన్నా కూడా తన కొత్త సినిమా రిలీజ్ అయితే మంచి ఆదరణ లభిస్తుంది. దీనికి సాయి తేజ్ వ్యక్తిత్వం కారణమని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం సాయితేజ్ కి, కొన్ని విషయాల్లో సాయి తేజ్ స్పందించిన విధానం కూడా చాలామందిని ఆకట్టుకుంది అని చెప్పొచ్చు.

ఇకపోతే సాయి తేజ్ కెరియర్ లో కూడా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. సాయి తేజ్ కెరియర్ లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో చాలామంది రిపబ్లిక్ అనే సినిమా అని చెబుతారు. అయితే ఆ సినిమా రిలీజ్ తరుణంలో సాయి తేజ్ ఒక యాక్సిడెంట్ కి గురి అయ్యాడు. ఆ తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టింది. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చాడు. అయితే సాయి తేజ్ రిపబ్లిక్ తర్వాత చేసిన సినిమా విరూపాక్ష. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. సాయి తేజ కు కూడా మంచి మార్కెట్ ఏర్పడింది.

SDT18 - Aishwarya Lekshmi

- Advertisement -

ప్రస్తుతం సాయి తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పుడు రోహిత్ కేపి అనేే డైరెక్టర్ తో ఓ మూవీ చేస్తున్నాడు. దానికి సంబరాల ఏటి గట్టు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీనిలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా చేస్తున్నారు.1947 స్వాతంత్రం టైంలో ఓ గ్రామంలో ఏం జరిగింది ? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయిపోయింది. అవుట్ కట్స్ లో ఓ విలేజ్ సెట్ వేశారు. సినిమా చాలా వరకు అక్కడే షూటింగ్ చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా కోసం 13 సెట్స్ లో సాయి తేజ్ వర్క్ చేయనున్నట్లు నిర్మాత రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు