Aishwarya Rajinikanth: ఓ ఇంటి వారైన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్..!

Aishwarya Rajinikanth.. ప్రముఖ హీరో ధనుష్ ఆయన భార్య, ప్రముఖ లేడీ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్..తమ డ్రీమ్ హౌస్ అంటూ ఒక ఇంటిని నిర్మించుకున్న విషయం తెలిసిందే.అయితే ఆ ఇంటి విషయంలోనే విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారని ఒక కొత్త వార్త తెరపైకి వచ్చింది. అయితే విడిపోయిన తర్వాత ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన ధనుష్ ఆ తర్వాత గృహప్రవేశం చేసి ఆ ఇంటిని తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ ను గృహ ప్రవేశానికి పిలవలేదు.. ఈ క్రమంలోనే తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ కూడా గృహప్రవేశం చేసింది.. ఈ కొత్త ఇంటి ప్రారంభోత్సవానికి ధనుష్ ను పిలవలేదు.. ఈ క్రమంలోనే ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Aishwarya Rajinikanth: Aishwarya is a family member.. Photos are viral..!
Aishwarya Rajinikanth: Aishwarya is a family member.. Photos are viral..!

విడాకుల తర్వాత తండ్రితోనే..

ఇకపోతే ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల అనంతరం తన తండ్రి ఇంటి లోనే ఉన్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటిని ఆమె కొనుగోలు చేసింది.. ఒక అపార్ట్మెంట్లో డూప్లెక్స్ ఫ్లాట్ ను కొనుగోలు చేసి..రీసెంట్ గా గృహప్రవేశ వేడుకలు నిర్వహించారు.. అయితే ఈ వేడుకల్లో ధనుష్ మాత్రం కనిపించలేదు.. ఇదిలా వుండగా మరోవైపు ఇద్దరూ కూడా పరస్పర అవగాహనతో విడిపోతున్నామని.. కానీ పిల్లల కోసం కలిసే ఉంటామని ..పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా కలిసే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.. అయితే తన కొత్త ఇంటి వేడుకకు ధనుష్ ను పిలవడానికి కనీసం ఫ్రెండ్ గా కూడా ఫీల్ అవ్వలేదు.. విడాకుల తర్వాత ధనుష్ నీకు కనీసం ఒక ఫ్రెండ్ గా కూడా కనిపించలేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్..

ఇకపోతే వీరిద్దరూ విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పెండింగ్లో ఈ కేస్ త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది..మరి ఈ ఇంటి విశేషాల విషయానికి వస్తే.. అద్భుతమైన ప్రత్యేకమైన ఇంటీరియర్ డిజైన్ తో ఇంటిని రూపొందించినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఐశ్వర్య రజనీకాంత్ ఈ కొత్త ఇంటికి తన కొడుకులతో సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఐశ్వర్య కెరియర్..

ఇక ఐశ్వర్య విషయానికి వస్తే.. ఒకప్పుడు తన భర్త ధనుష్ ని హీరోగా పెట్టి చేసిన త్రి సినిమా ఎంత విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో వై దిస్ కొలవరీ పాట. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈమె ఇటీవల తన తండ్రితో కలిసి లాల్ సలాం అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు ఇప్పుడు మరో అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరి ఈ సినిమాతో నైనా విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు