Ajith : ఓవర్సీస్ బిజినెస్ లోనూ పోటీ

వలిమై దర్శకుడు హెచ్.వినోథ్ దర్శకత్వంలో తమిళ హీరో అజిత్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పేరు తునివు అనే టైటిల్ తో.. నో గట్స్ నో గ్లోరీ అనే ట్యాగ్ లైన్ తో రూపుదిద్దుకుంటుంది. ఇందులో మలయాళ బ్యూటీ మంజు వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం  గిబ్రాన్ అందిస్తున్నారు. ఇప్పటికే  అజిత్ – వినోద్ కాంబోలో నెర్కొండ పార్వాయి, వలిమై చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘తునివు’ యాక్షన్ ఎంటర్ టైనర్ తో హ్యాట్రిక్ సినిమా కానుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి పలు రూమర్స్ వినిపించాయి. ఏకంగా రూ.280 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే తాజాగా సింగపూర్ మినహా ‘తునివు’ ఓవర్సిస్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ రూ.11 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. సింగపూర్ తో సహా మొత్తం ఓవర్సిస్ హక్కుల విలువ సుమారు రూ.13 కోట్లకు తునివు సినిమాకి బిజినెస్ జరిగినట్టు సమాచారం. 

మరోవైపు విజయ్ నటించిన ‘వరిసు’ సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళంలో వరిసు, తునివు పోటీపోటీగా విడుదలవుతున్నాయి. అయితే వరిసు చిత్రం ఓవర్సిస్ లో రూ.35 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. తమిళంలో విజయ్- అజిత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో మాత్రం ఇప్పటికే నిర్మాత దిల్ రాజు అధికంగా వరిసుకి థియేటర్లను బుక్ చేసినట్టు సమాచారం. ఈ రెండింటిలో ఈ సినిమా విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరి. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు