Akshay Kumar : వివాదాలు వద్దు

బాలీవుడ్ లో ప్రస్తుతం బాయ్ కాట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చడ్డాను, అక్షయ్ కుమార్ నటిస్తున్న రక్షా బంధన్ సినిమాను బాయ్ కాట్ చేయాలని కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి #BoycottLaalSinghChaddha, #BoycottRakshaBandhan అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి.

గతంలో హీరో అమీర్ ఖాన్.. దేశంలో రక్షణ లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. అలాగే పీకే సినిమాలో కొన్ని సినిమాలు అభ్యంతరంగా ఉన్నాయని ఒక వర్గం ఆగ్రహంగా ఉంది. దీంతో పాటు హీరోయిన్ కరీనా కపూర్ ఒక సందర్బంలో థియేటర్లుకు వస్తే రండి, లేకపోతే పొండి అనే అర్థం వచ్చేలా మాట్లాడింది. దీంతో బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా ట్రెండ్ అయింది. అలాగే అక్షయ్ సినిమా రక్షా బంధన్ చిత్ర రైటర్ కనికా థిల్లాన్ గతంలో గో మూత్రం, హిజాబ్ బాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాయ్ కాట్ రక్షా బంధన్ ట్రెండ్ లోకి వచ్చింది.

దీనిపై ఇప్పటికే అమీర్ ఖాన్ స్పందించగా, తాజాగా అక్షయ్ కుమార్ స్పందించారు. గొప్ప దేశాల్లో ఒకటిగా నిలిచేలా భారత్ అభివృద్ది అవుతుందని, అర్ధిక వ్యవస్థ బలపడేందుకు సినిమా రంగం కూడా తన వంతు సాయం చేస్తుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలు చెప్పి సినిమాలపై వివాదం చేయొద్దు అని అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు