Akshay Kumar: వారి చేతిలో దారుణంగా మోసపోయిన స్టార్ హీరో..!

Akshay Kumar.. బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు.. ఎలాంటి పాత్రలోనైనా సరే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు అక్షయ్ కుమార్. అలా తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో కూడా నటించి తన నటనకు తగ్గ గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అక్షయ్ కుమార్ చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోతుంది. ఇటీవలే తాను నటించిన సర్ఫరా సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు అక్షయ్ కుమార్. ఇందులో భాగంగా తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది.

Akshay Kumar: The star hero who was badly cheated by them..!
Akshay Kumar: The star hero who was badly cheated by them..!

అక్షయ్ కుమార్ వ్యక్తిగత జీవితం..

ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితంలోనే కాకుండా సినీ కెరియర్ లో కూడా జరిగిన విషయాలను తెలియజేస్తూ.. ఇలా మాట్లాడారు అక్షయ్ కుమార్..”నన్ను వ్యక్తిగత జీవితంలో అటు సినీ కెరీర్ లో కూడా చాలామంది మోసం చేశారు. అయితే ఇలా మోసం చేసేవారు అన్ని రంగాలలో కూడా ఉన్నారు..నా లాగా అమాయకంగా ఉండేవారు ఇలాంటి వారి చేతిలో మోసపోయి కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని కూడా చవి చూశారు అంటూ తెలిపారు. ఇలా దారుణంగా మోసపోయిన వారిలో తాను కూడా ఒకరిని అని కూడా తెలియజేశారు. అయితే ఆ తర్వాత ఆ విషయాన్ని గుర్తించి వారందరిని దూరం పెట్టానని తెలిపారు అక్షయ్ కుమార్.

నిర్మాతల చేతుల్లో మోసపోయిన అక్షయ్ కుమార్..

అలాంటి వారితో ఇప్పటికి కూడా అసలు మాట్లాడలేదని , కొంతమంది నిర్మాతలు తనకు ఇస్తామన్న రెమ్యూనరేషన్ ఇవ్వకుండా మోసం చేశారని ఇలా చేయడం తన దృష్టిలో చెప్పిన మాటని తప్పడమే, అది మోసం కిందికే వస్తుంది అంటూ అక్షయ్ కుమార్ తెలియజేశారు. తాజాగా అక్షయ్ కుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి స్టార్ హీరో కి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మరి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అయినా కూడా అక్షయ్ కుమార్ ఇప్పటివరకు ఈ విషయాలను ఎక్కడ తెలియజేయలేదు.

- Advertisement -

అక్షయ్ కుమార్ సినిమాలు.

ఇక అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఖేల్ ఖేల్ మే అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఇందులో టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను, వాణి కపూర్, ఆదిత్య సిరి,ప్రగ్యా జైస్వాల్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అక్షయ్ కుమార్ నిర్మాతల చేతుల్లో మోసపోయానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచడమే కాదు కొత్తగా వచ్చే వారిని అలర్ట్ చేస్తున్నారు కూడా. ఒకవైపు హీరోగా మరొకవైపు విలన్ గా నటిస్తూ అటు నార్త్ ఆడియన్స్ తో పాటు సౌత్ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటున్నారు..ఏది ఏమైనా అక్షయ్ కుమార్ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు