Alia Bhatt : నా కూతురిని ఆ పని మాత్రం చేయనివ్వను… ఇప్పటినుంచే రూల్స్ పెడుతున్న అలియా

Alia Bhatt : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ట్రిపుల్ ఆర్ సినిమాతో సీతగా సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ను గడుపుతోంది. బిజీ లైఫ్, కేరింగ్ హస్బెండ్ రణబీర్ కపూర్, అందమైన కూతురు రాహాతో హాయిగా పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా అలియా భట్ తాను చేసిన తప్పును ఒప్పుకుంది. అంతేకాకుండా ఆ తప్పును తన కూతురుని చేయనివ్వను అంటూ బహిరంగంగానే చెప్పేసింది. మరి ఇంతకీ అలియా చేసిన తప్పేంటి? అంటే…

తప్పు ఒప్పుకున్న అలియా

అలియా భట్ తాజాగా తాను ఓ సినిమా కోసం ఇల్లు, ఫ్యామిలీని వదిలి ఉండాల్సి వచ్చిందనే విషయం గురించి గుర్తు చేసుకుంది. హాలీవుడ్ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీ షూటింగ్ కోసం లండన్ కు వెళ్లాను. అయితే మూడు రోజుల పాటు నేను నిద్రపోలేదు. అలా ఇంటిని ఫ్యామిలీని వదిలేసి రావడం వల్ల నేను మంచి కూతురిని కాదనే ఫీలింగ్ నాకు ఉండేది అని అలియా భట్ తెలిపింది.

కూతురు విషయంలో అది కుదరదు

తన కూతుర్ని 20 ఏళ్ల వరకు ఇల్లు వదిలి వేరే చోట సెటిల్ కానివ్వను అని అలియా తాజాగా చెప్పుకొచ్చింది. తను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పటికి 23 ఏళ్లని వివరించిన అలియా షూటింగ్ కారణంగా చాలా వరకు ఇంటికి దూరంగా ఉన్నాను. అది ఏ నగరమో కూడా అప్పట్లో నాకు తెలియదు. కానీ తర్వాత తిరిగి చూసుకుంటే నేను చిన్న వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చినట్టుగా అనిపించింది. ఇప్పుడు నా కూతురు విషయంలో మాత్రం అలా జరగనివ్వను అని అలియా భట్ పేర్కొంది.

- Advertisement -

పడితేనే కదా ఎలా లేవాలో తెలిసేది?

నేను భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తిని. కానీ రాహా విషయంలో మాత్రం అలా కాదు. దీంతో మా నాన్న రాహకు కింద పడే అవకాశం ఇవ్వకపోతే ఎలా లేవాలో ఎలా తెలుస్తుంది? అని అంటూ ఉంటారని అలియా వివరించింది.

రీ ఎంట్రీకి రెడీ

ఇక పెళ్లి పిల్లల కోసం రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇప్పుడు మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో లవ్ అండ్ వార్ అనే సినిమాలో నటిస్తోంది అలియా భట్. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కాగా రీసెంట్ గా మెట్ గాలా 2024 లో అలియా భట్ అదిరిపోయే లుక్ లో కనిపించింది. చీరలో క్యూట్ లుక్ తో మెరిసిన అలియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరోవైపు ఆమె భర్త రణబీర్ కపూర్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న రామాయణంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ మూవీ బడ్జెట్ 800 కోట్లకు పైగానే ఉంటుందని తాజా సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు