పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తో అల్లు అర్జున్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.పుష్ప లో రష్మిక మందన్న కథానాయికగా నటించగా, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.
సినిమా కథ, దర్శకత్వం మాత్రమే కాకుండా డిఎస్పి సంగీతం సినిమాకు మేజర్ హైలెట్ అయింది. మొదటి సింగిల్ లిరికల్ విడుదల నుండి, కంప్లీట్ మ్యూజికల్ ఆల్బమ్ రిలీజైన వరకు పుష్ప పాటలు అగ్రస్థానంలో నిలిచాయి. శ్రీవల్లి, ఊ అంటావా, సామి వంటి పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పుష్ప ఖాతాలో ఒక అరుదైన రికార్డ్ చేరింది. ఐదు బిలియన్ల వీక్షణలను సాధించిన మొట్టమొదటి భారతీయ ఆల్బమ్గా నిలిచింది.
కేవలం పాటలకు మాత్రమే కాకుండా సినిమాకి కూడా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. రాజ్ కుమార్ హిరానీ వంటి అగ్ర దర్శకులు కూడా పుష్ప చిత్రంపై ప్రశంసలు జల్లు కురిపించారు. పుష్ప ఆ స్థాయిలో హిట్ అవ్వడంతో పుష్ప పార్ట్ 2 పై భారీ అంచనాలు పెరిగాయి.