Allu Arjun : “బన్నీ గాలీజ్‌గాడు” ఈవెంట్‌లో అందరి ముందు పరువు తీసిన అల్లు అరవింద్

Allu Arjun : ప్రస్తుతం ఎక్కడ చూసినా బన్నీ గురించే చర్చ నడుస్తోంది. రీసెంట్ గా మెగా, అల్లు వార్ లఓ ఆయనపై ట్రోలింగ్ జరిగింది. నిన్నటి దాకా సుకుమార్, బన్నీ మధ్య విబేధాలు వచ్చాయని పుష్ప 2 ఆగిపోయిందని రూమర్స్ నడిచాయి. బన్నీ టీం ఆ వివాదంపై క్లారిటీ ఇవ్వడంతో సద్దుమణిగింది. అయితే అంతలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తాజాగా ఆయన తండ్రి చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బన్నీ గలీజ్ గాడు అంటూ ఈవెంట్లో అందరి ముందు ఆయన పరువు తీసేశారు అల్లు అరవింద్. మరి ఏ ఈవెంట్లో ఈ సంఘటన జరిగింది ? ఎందుకు అల్లు అరవింద్ బన్నీపై ఇలాంటి కామెంట్స్ చేశాడు ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బన్నిపై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్…

ఆయ్ అనే తెలుగు మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా యాంకర్ స్రవంతి చోకరకపు అల్లు అరవింద్ దగ్గరకు వచ్చి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నను అడిగింది. ప్రతి బ్యాచ్ లో ఒక గలీజ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. మరి మీ బ్యాచ్ లో ఎవరు? అంటూ డైరెక్ట్ గా అల్లు అరవింద్ నే ప్రశ్నించింది. ఆయన వెంటనే బన్నీ గాడు గలీజ్ అంటూ తన పక్కనే ఉన్న నిర్మాత బన్నీ వాస్ పై చెయ్యేశారు. అయితే ఆయన వెంటనే బన్నీ అంటే నేనే అనుకుంటారు అని చెప్పగా… అల్లు అరవింద్ నవ్వుతూ బన్నీ గలీజ్… బన్నీ వాస్ బెస్ట్ అంటూ క్లారిటీ ఇచ్చారు. బెస్ట్, వరస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పమంటే అల్లు అరవింద్ తన కొడుకుని వరస్ట్ ఫ్రెండ్ అంటూ ఇలా కామెంట్స్ చేయడం ఫన్నీ గానే అయినా అల్లు అభిమానులు కాస్త ఫీలవుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయిన అల్లు అర్జున్ పై ఇలాంటి కామెంట్స్ చేశారేంటి అంటూ కాస్త చిన్న బుచ్చుకుంటున్నారు. కానీ చాలామంది దీన్ని ఫన్నీగానే తీసుకుని వైరల్ చేస్తున్నారు.

Allu Arjun's Father Allu Aravind Was The Producer Of Bollywood's First Rs 100 Crore Hit, Ghajini

- Advertisement -

వారసులయితే సరిపోదు

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న మూవీ ఆయ్. అంజిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం చేసిన ప్రమోషనల్ స్టంట్ దెబ్బేసింది. హైప్ క్రియేట్ చేసేందుకు అంజిత్, కసి రెడ్డి కలిసి బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయినట్టుగా వీడియోను వదలడం ట్రోలింగ్ కు దారి తీసింది.

ఈ నేపథ్యంలోనే ఆయ్ మూవీ థీమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను తాజాగా మేకర్స్ హైదరాబాద్ లఓ నిర్వహించారు. ఈ వేడుకకు గెస్ట్ గా హాజరైన అల్లు అరవింద్ తనకు, ఎన్టీఆర్‌కు మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణను వెల్లడించాడు. ఈ ప్రాజెక్టు చేపట్టే ముందు ఎన్టీఆర్‌కు ఫోన్ చేశానని చెప్పారు. ”నితిన్‌ని ఫైనల్ చేసిన తర్వాత ఎన్టీఆర్‌ని పిలిచాను. ఎన్టీఆర్ తన కష్టమే తనను మరింత ముందుకు తీసుకెళ్తుందని, కుటుంబ వారసత్వం తనను పెద్ద ఎత్తుకు తీసుకెళ్లదని చెప్పాడు. మా బ్యానర్‌లో నితిన్‌ నటించినందుకు ఆయన కూడా హ్యాపీగా ఫీలయ్యారు. నితిన్‌లో ఆకర్షణ ఉంది. అతను తన పాత్రను బాగా చేసాడు” అని అల్లు అరవింద్ అన్నారు. ఆగస్ట్ 15న ‘ఆయ్’ విడుదల కానుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు