Allu Arjun : మెగా ఫ్యామిలీలో పవన్ గెలుపు పార్టీ… ఎగ్గొట్టి ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లిపోయిన బన్ని

Allu Arjun : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపుపై మెగా హీరోలతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటుంటే బన్నీ మాత్రం కుటుంబంతో కలిసి రోమ్ లో చక్కర్లు కొడుతున్నారు. మరి బన్నీ కావాలనే మెగా పార్టీని మిస్ అయ్యడా? అనే విషయాన్ని తెలుసుకుందాం.

రోమ్ లో ఫ్యామిలీతో బన్నీ

అల్లు అర్జున్ వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితం పరంగా కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు. తన భార్య స్నేహా రెడ్డి, ఇద్దరు అందమైన పిల్లలు అయాన్, అర్హలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి ఎలాంటి అవకాశం దొరికినా వదులుకోరు. ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తాడు. తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ లో బిజీగా ఉన్నారు. ఇటలీలోని రోమ్‌ లో ఉన్న కొలోసియమ్‌ను ఫ్యామిలీతో కలిసి సందర్శించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మెగా పార్టీ నుంచి ఎస్కేప్

ప్రస్తుతం ఎక్కడ చూసినా మెగా పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలె కన్పిస్తున్నాయి. భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి ఘనంగా గులాబీ పూలతో స్వాగతం పలకడం, పవన్ కాళ్ళు మొక్కి మరీ అన్నయ్య ఆశీర్వాదం తీసుకోవడం వంటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా, వాటిని చూసి మెగా అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఏఎ కీలకమైన పరిణామంలో బన్నీ మిస్ కావడం గమనార్హం.

- Advertisement -

Photo: Allu Arjun takes break from Pushpa 2; enjoys Colosseum visit in Rome with kids Arha and Ayaan | PINKVILLA

కావాలనే ఎగ్గొట్టాడా?

ఒకవైపు మెగా హీరోలంతా కలిసి పవన్ విజయాన్ని మెగాస్టార్ ఏర్పాటు చేసిన లావిష్ పార్టీలో సెలబ్రేట్ చేసుకుంటుంటే బన్నీ మాత్రం ఫ్యామిలీతో కలిసి రోమ్ లో ఎంజాయ్ చేస్తుండడం మళ్లీ కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అంటూ ఈ రెండు కుటుంబాలకు పడట్లేదు అన్న వార్తలు విన్పిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ చేసే పనులు ఈ పుకార్లకు ఆజ్యం పోస్తున్నాయి. పుష్ప 2 మూవీ షూటింగ్ లో ఉండి ఉంటే, పోనీ షూటింగ్ బిజీ కారణంగా బన్నీ తాజా మెగా పార్టీకి హాజరు కాలేదులే అని సరిపెట్టుకునే వారు. కానీ ఆయన ఇటు మెగా ఫ్యామిలీకి కీలకమైన ఈ సెలబ్రేషన్స్ లో భాగం కాకుండా ఏకంగా రోమ్ కు చెక్కేయడం చర్చకు దారి తీసింది. ఎన్నికలకు ముందు బన్నీ పవన్ కు కాకుండా వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.

పుష్ప 2పై ఎఫెక్ట్ ఉంటుందా?

ఈ నేపథ్యంలోనే పుష్ప 2పై గట్టిగా ఎఫెక్ట్ పడుతుందనే ప్రచారం మొదలైంది. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పుష్ప 2: ది రూల్ ఆగస్టు 15న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. మరి బన్నీ చర్యల కారణంగా ఈ మూవీ భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదా? మెగా అభిమానులు పుష్ప 2 మూవీని పట్టించుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు