Wayanad Landslide : కేరళలో వయినాడ్ లో వరదలు వచ్చిన సంగతి తెలిసిందే.. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి జరిగిన ప్రమాదంలో అనేకమంది చనిపోయారు. మరింతమంది నిరాశ్రయులు అయ్యారు.. ఈ ఘటన అందరిని కదిలించి వేస్తుంది.. వరద భాధితులను ఆదుకోవడం కోసం ప్రజలు, రాజకీయ నేతలతో పాటుగా సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. భాధితులను ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరు కదులుతున్నారు.. ఈ మేరకు ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా భారీ విరాళాన్ని అందించారు. తాజాగా దీనిపై అనేక వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
కేరళలో సంభవించిన భారీ వరదల కారణంగా ఎన్నో వందల మంది ప్రాణాలను కోల్పోయారు. అందులో 300 ల మంది మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు. ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. అయితే వయనాడ్ బాధితులకు దేశ వ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలను పంపిస్తున్నారు.. తాజాగా అల్లు అర్జున్ కూడా భారీగా విరాళాన్ని ప్రకటించారు.. అల్లు అర్జున్ తన వంతు సాయంగా రూ. 25 లక్షలను అందించారు.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
కేరళ ప్రజలకు అల్లు అర్జున్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు.. అక్కడ పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో చూశాం.. అలా అక్కడ బన్నీని అందరు మల్లు స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అలాంటి బన్నీ కేవలం రూ. 25 లక్షలు ఇవ్వడం పై అల్లు యాంటి ఫ్యాన్స్ పెదవిరుస్తున్నారు.. అంత గొప్పగా వాళ్లు అభిమానిస్తున్నారు. కానీ నువ్వు ఇంత తక్కువ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ ఏడాది చివరిలో సినిమా విడుదల కాబోతుంది.. ఆ తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు..