Allu Arjun : బన్నీకి ఉచ్చు బిగిస్తున్న ఏపీ సర్కార్.. మొన్న డిప్యూటీ సీఎం, నేడు సీఎం సీరియస్ వార్నింగ్

Allu Arjun : అల్లు అర్జున్(Allu Arjun), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతుంది. సరైనోడు సినిమా సక్సెస్ ఈవెంట్ లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని చెప్పినప్పుడు నుంచి ఈ వివాదం మొదలైంది. దీని గురించి అల్లు అర్జున్ ఒక మనసు(Oka Manasu) సినిమా ఫంక్షన్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అయితే ఆ వివాదం ఇంకా ముదిరిపోయింది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా అల్లు అర్జున్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎర్రచందనం స్మగ్లర్ గా ఉంటుంది.

ఇక రియల్ లైఫ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం అనేది ఎంతటి నేరము అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని గురించి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావిస్తూ ఒకప్పుడు హీరో అంటే పది మందికి మంచి చేసేవాడు. కానీ ఇప్పుడు స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ పుష్ప సినిమాపై కామెంట్స్ కూడా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఇది చెప్పిన ఉద్దేశం ఏమిటో ఎవరికి తెలియదు కానీ, కావాలనే అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు అంటూ చాలామంది రియాక్ట్ అయ్యారు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ మామ కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు.

ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా స్మగ్లర్ గురించి మాట్లాడారు. ఎర్ర చందనం దొంగలను హెచ్చరిస్తున్నా, గత ఐదేళ్లు సాగినట్లుగా మీ ఆటలు ఇక సాగవు. గుర్తు పెట్టుకోండి.. అడవులను నరికేందుకు వెళ్తే.. అదే చివరి రోజు అవుతుంది. అంటూ సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇది చంద్రబాబు నాయుడు రియల్ లైఫ్ లో చెప్పినా కూడా చాలామంది అల్లు అర్జున్ కి ఈ మాటను అన్వయిస్తున్నారు.

- Advertisement -

Pushpa

ఇకపోతే పవన్ కళ్యాణ్ ను వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే కొత్త జీవో కూడా రిలీజ్ చేసేది. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు థియేటర్ దగ్గర కాపలాగా ఉండేవాళ్ళు. అయితే వీటన్నిటిని తట్టుకొని పవన్ కళ్యాణ్ పదేళ్లు కష్టపడి నేడు జనసేన పార్టీ తరఫున డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సిపి కి ఎంత వ్యతిరేకంగా పోరాడారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ తరుణంలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నంద్యాల క్యాండిడేట్ వద్దకు అల్లు అర్జున్ వెళ్లడం తీవ్రమైన దుమారం రేపింది. అక్కడితో మెగా ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య వివాదాలు మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు