Allu Arjun : అల్లు అర్జున్ కి పాన్ ఇండియా రేంజ్లో అవమానం… పరువు మొత్తం పొయింది గా…

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, మెగా అండదండలతో ఎదిగి, ఇప్పుడు సొంతంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. పుష్ప తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించాడు ఈ హీరో. ఇదిలా ఉండగా కొన్నేళ్లుగా అల్లు ఫ్యామిలీ కి మెగా ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్యనే ఈ మనస్పర్థలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు అనుకుంటున్నారు. ఇక మొన్నామధ్య ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో జరిగిన రచ్చ గురించి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసిపి లో ఉన్న తన ఫ్రెండ్ కి బన్నీ సపోర్ట్ చేయడంతో మెగా అల్లు ఫ్యామిలి మధ్య మనస్పర్థలు, అలాగే అభిమానుల మధ్య వైరం పీక్స్ కి చేరింది. అప్పటి నుండి అల్లు అర్జున్ కి నెటిజన్ల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. అప్పుడే అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యామిలీ పరువు తీసాడని నెటిజన్లు కామెంట్స్ చేసారు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా పాన్ ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ కి ఉన్న పరువు ఈరోజు మరింత పోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

Allu Arjun didn't get invited to Anant Ambani's wedding

పాన్ ఇండియా రేంజ్ లో పరువు పోగొట్టుకున్న అల్లు అర్జున్…

తాజాగా అల్లు అర్జున్ పరువు పాన్ ఇండియా వ్యాప్తంగా ఈరోజు పోయిందని, ఇక అల్లు అర్జున్ తలెత్తుకోలడని, అసలు పాన్ ఇండియా హీరో రేంజ్ ఇంకా రాలేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్, ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే… లేటెస్ట్ గా అనంత్ అంబానీ – రాధిక మర్చంట్‌ ల వివాహ వేడుకలు జులై 12 రాత్రి అట్టహాసంగా ముంబై నగరంలో అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్‌ లో జరిగిన విషయం తెలిసిందే. ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకి సౌత్ ఇండియా స్టార్లు, హాజరయ్యారు. అయితే టాలీవుడ్ నుండి అతి తక్కువ మంది సెలెబ్రటీలు మాత్రమే హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్, అలాగే రానా, అఖిల్ మాత్రమే వారి ఫ్యామిలీ తో హాజరయ్యారు. అయితే పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మాత్రం రాలేదు. దీంతో అల్లు అర్జున్ పరువు మొత్తం పోయింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

అల్లు అర్జున్ కి ఆహ్వానం అందలేదా?

అయితే అనంత్ అంబానీ – రాధికా పెళ్లి వేడుకకు రామ్ చరణ్, మహేష్ బాబు, వెంకటేష్, రజినీకాంత్, సూర్య వంటి పాన్ ఇండియా స్టార్లు వారి ఫ్యామిలీస్ తో హాజరయ్యారు. కానీ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ లేకపోవడం అభిమానులకి మింగుడు పడడం లేదు. అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం అసలు అల్లు అర్జున్ కి ఆహ్వానమే అందలేదని సమాచారం. అయితే చరణ్ కి మాత్రం ఆహ్వానం అందింది. రామ్ చరణ్ అంబానీ ప్రతి ఈవెంట్ లో కూడా కనిపించడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందడం పట్ల అల్లు అర్జున్ ఫీల్ అవుతున్నట్టు, ఈ విషయం బన్నీ కి అస్సలు మింగుడు పడట్లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక గత కొన్ని గంటల నుండి మళ్ళీ రామ్ చరణ్ VS అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ నెట్టింట రచ్చగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు