Allu Arjun: ఇంకొంచెం ఫైర్ యాడ్ చేశాడు, రేపటి నుంచి కొట్టుకు చస్తారు

Allu Arjun: పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. చెప్పను బ్రదర్ అనే దగ్గర మొదలైన ఈ విభేదం అనేక విషయాలు లో ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని కొన్ని సార్లు అల్లు అర్జున్ ప్రవర్తించే విధానం ఇవన్నీ కూడా కొంతమేరకు కొత్త వివాదాలను సృష్టిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఒకవైపు కష్టపడుతుంటే, మరో వైపు పవన్ కళ్యాణ్ ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ కు అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి నంద్యాల వెళ్లడం తీవ్ర కలకలం రేపింది.

అక్కడితో అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. అయితే బన్నీ వాటి గురించి ఏ రోజు స్పందించలేదు. ఆ తర్వాత బన్నీ బయట ఒకసారి కూడా ఈ విషయాలను ప్రస్తావించలేదు. ట్విట్టర్ వేదికగా కూడా కొన్ని సినిమాలు గురించి మాట్లాడాడు తప్ప ఈ విషయం గురించి నోరు కదపలేదు. మరోవైపు ఇన్ డైరెక్ట్ గా బన్నీ మీద నాగబాబు సైటర్ వేయడం కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత ట్వీట్ డిలీట్ చేయడం ఇలాంటివి చాలా జరిగాయి. ఇకపోతే రీసెంట్ గా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అని సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు బన్నీ అక్కడ ఈ విషయం గురించి ప్రస్తావించాడు.

నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా అంటూ మాట్లాడారు బన్నీ. అయితే ఇది సినిమా విషయంలో మాట్లాడిన కూడా ఇన్ డైరెక్ట్ గా నంద్యాల విషయంలో క్లారిటీ ఇచ్చాడు అంటూ చాలామంది ఊహిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గెలిచారు కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా స్టేజ్ పైన కంగ్రాట్స్ చెప్పటం. ఏ పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చిందో వివరించడం వంటివి చేసుంటే బాగుండేది. గతంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని చెప్పినప్పుడు ఒక పది నిమిషాలు పాటు ఒక మనసు ఆడియో లాంచ్ లో క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్. అలా దీనిలో కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ నాకు నచ్చితే వస్తా అనే డైలాగ్ తో చిన్న ఫైర్ యాడ్ చేశాడు. దీంతో చాలామంది మెగా అభిమానులు ఇంకా ఫైర్ యాడ్ చేశాడు రేపటి నుంచి కొట్టుకు చస్తారు అంటూ పోస్టులు పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు