Allu Arjun : సినిమాల్లోనే కాదు సాయంలోనూ “ఐకాన్”… తెలుగు రాష్ట్రాలకు బన్నీ భారీ సాయం

Allu Arjun : తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీ వరదలతో ప్రజలు రోడ్డున పడ్డారు. ఎంతోమంది ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల ప్రజలకు కనీసం వసతులు లేవని తెలుస్తుంది. అలాంటి వారిని ఆదుకోవడం కోసం సెలెబ్రేటీలు ముందుకు వస్తున్నారు. ఒక్కొక్కరుగా తెలుగు రాష్ట్రాల సీఏం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

వరద కారణంగా అన్ని కోల్పోయిన వారిపై భాధను వ్యక్తం చేశారు.. తెలుగు రాష్ట్రాల ప్రజల భాధలు ఆయనను చలింప చేశాయని తెలిపాడు. అలాగే చెరో రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. అల్లు అర్జున్ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకు సాయం చెయ్యడం కోసం ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ఆయన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. పుష్ప రాజ్ అంటే ఆ మాత్రం ఉండాలి తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో పుష్ప 2 సినిమా రాబోతుంది. ఆ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతుంది.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లోని వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా తెలుగు ఇండస్ట్రీ ముందుకు వస్తుంది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు తోచిన సాయం ప్రకటిస్తున్నారు. ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ ఎత్తున విరాళం ప్రకటించారు. అలానే తాజాగా పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు. ఇక సెలెబ్రేటీలు ఒక్కొక్కరుగా సాయాన్ని అందిస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు