Allu Sireesh: ఆ సినిమా రీమేక్ కాదని తేల్చేసిన అల్లు శిరీష్

Allu Sireesh: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోస్ లో అల్లు శిరీష్ ఒకరు. అయితే గౌరవం ఉన్న సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. ఆ సినిమా అద్భుతమైన కలెక్షన్లు తీసుకురాకపోయినా కూడా ఒక మంచి సినిమాను చేశాడు అని ఒక గౌరవం అయితే మాత్రం తీసుకొచ్చింది. అయితే ఇప్పటివరకు అల్లు శిరీష్ కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒకటి కూడా లేదు. కొన్ని సినిమాలు ఉన్నా కూడా అవి అంతంత మాత్రమే ఆడాయి. పరశురాం మారుతి వంటి దర్శకుల దర్శకత్వంలో కూడా సినిమాలు చేశాడు శిరీష్.

నీకు రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత శిరీష్ చేస్తున్న సినిమా బడ్డీ. అల్లు శిరీష్ జంటగా గాయత్రి భరద్వాజ్ నటిస్తుంది. ఈ సినిమాకు సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా జూలై 26, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా ఇదివరకు తమిళ హీరో ఆర్య నటించిన చిత్రం టెడ్డీకి రీమిక్ అంటూ చాలామంది అనుకున్నారు . ఈ విషయంపై అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చాడు.

Allu Sirish

- Advertisement -

ఈ సినిమా రీమేక్ కాదని రిలీజ్ అయిన ట్రైలర్ ని చూస్తే అది మీకే అర్థమవుతుంది  నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఒక కొత్త ప్రయత్నం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్న విషయంపై తాను కూడా భయపడ్డానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత తాను కూడా కాస్త రిలీఫ్ అయినట్లు చెప్పుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తారని., పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా.. కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ ని ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు శిరీష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు