Amrutha movie: చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. అక్కినేని ఇంట కోడలిగా అడుగు..

Amrutham movie.. సాధారణంగా నటీనటులతో పోల్చుకుంటే చైల్డ్ ఆర్టిస్టులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వీరు నటించేది ఒకటి రెండు చిత్రాలే అయినా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటిస్తూ అందరిని కట్టిపడేస్తూ ఉంటారు. ఇకపోతే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా ఒకటి రెండు చిత్రాలలో నటించి భారీ ఇమేజ్ దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. ఇక ఉన్నత విద్య కారణంగా ఇండస్ట్రీకి దూరమైన చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఒక్కొక్కరిగా సోషల్ మీడియాలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో అమృతం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కీర్తన కూడా ఒకరు.

Amrutha movie: Do you remember the child artist..now she is Akkineni daughter in law..!
Amrutha movie: Do you remember the child artist..now she is Akkineni daughter in law..!

డైరెక్టర్ పార్తీబన్, నటి సీత ల కుమార్తె కీర్తన..

ఈమె పేరు కీర్తన.. పేరు చెబితే గుర్తుపట్టరు కానీ మణిరత్నం దర్శకత్వంలో మాధవన్, సిమ్రాన్ జంటగా 2002 లో విడుదలైన అమృతం సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తాను. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు అంతర్జాతీయ అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులు కూడా అందుకుంది. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది బేబీ పీఎస్ కీర్తన. ఈమె ఎవరో కాదు కోలీవుడ్ నటుడు కం డైరెక్టర్ పార్తీబన్, నటి సీత ల కుమార్తె. తల్లిదండ్రులు ఇద్దరూ నటీనటులు కావడం చేత ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులు..

ఇందులో స్టార్ హీరో , హీరోయిన్గా మాధవన్ , సిమ్రాన్ నటించినా, కథ మొత్తం కీర్తన చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాని తన సొంత తల్లిదండ్రులను కలుసుకోవాలని ఒక చిన్నారి పడే ఆరాటం , పోరాటం ఆధారంగా తెరకేక్కించారు. అల్లరి పిల్లగా కనిపించడమే కాదు భావోద్వేగ సన్నివేశాలలో కూడా తన నటనతో ప్రేక్షకులు చేత కన్నీరు పెట్టించింది. మొదటి సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డులు సైతం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె మరో సినిమాలో నటించలేదు. చదువుల నిమిత్తం ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ప్రస్తుతం అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది.

- Advertisement -

అక్కినేని ఇంట కోడలిగా..

అక్కినేని ఇంటికి పెద్ద కోడలుగా మారిపోయింది కీర్తన. అక్కినేని అంటే తెలుగువారు కాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ అక్కినేని. శ్రీకర్ తండ్రి అక్కినేని సంజీవి.. తెలుగులో అనేక చిత్రాలను నిర్మించారు. అంతే కాదు ఎల్వీ ప్రసాద్ కి సంజీవి సోదరుడు కూడా.. ఇక కీర్తన భర్త అక్షయ్ హిందీలో పలు చిత్రాలను తెరకెక్కించి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కీర్తన ఇండస్ట్రీకి దూరంగా.. ఫ్యామిలీ లైఫ్ కి దగ్గరగా కెరియర్ ను లీడ్ చేస్తోంది. ఏది ఏమైనా సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన కీర్తన మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డ్ లతో పాటు జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుని , ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. నటించింది ఒక సినిమానే అయినా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మళ్ళీ సినిమాల్లోకి వస్తే చూడాలని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈమె మాత్రం వైవాహిక జీవితానికే తన జీవితాన్ని అంకితం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటోంది కీర్తన.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు