Anchor Shyamala: చంపేస్తామంటూ బెదిరింపులు.. ఆవేదన వ్యక్తం చేస్తున్న యాంకర్..!

Anchor Shyamala.. ప్రముఖ యాంకర్ శ్యామల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇష్టం లేకపోయినా తన భర్త నరసింహారెడ్డి కోరిక మేరకు ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె యాంకర్ గా మారి తనకంటూ ఒక సత్తా చాటింది.. అద్భుతమైన వాక్చాతుర్యంతో కట్టిపడేసే అందంతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఒకవైపు యాంకర్ గా పలు షోలకు వ్యవహరిస్తూనే.. మరొకవైపు సినిమా ఆడియో లాంచ్ లకు ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కూడా హోస్టుగా వ్యవహరించింది.. అంతేకాదు పలు సీనియర్ హీరోలు , స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు పోషించి.. అటు బుల్లితెర ఇటు వెండితెర ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది.. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు తమకు నచ్చిన పార్టీలకు మద్దతు తెలుపుతూ ప్రచారాలు కూడా నిర్వహించారు.. అందులో భాగంగానే యాంకర్ శ్యామల కూడా వైసిపి పార్టీకి మద్దతు పలుకుతూ పూర్తిస్థాయిలో ప్రచారం చేపట్టింది.. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా నిర్వహించింది..

వైసీపీ శ్రేణులపై దాడులు..

Anchor Shyamala: Death threats.. Anchor expressing his grief..!
Anchor Shyamala: Death threats.. Anchor expressing his grief..!

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో వెలువడిన ఫలితాలలో ప్రజలు కూటమికి మద్దతు పలికారు.. దాదాపు 164 సీట్లతో అఖండ విజయం సాధించింది కూటమి. ఈ నేపథ్యంలోనే పలువురు విజయం సాధించామని విర్రవీగుతూ వైసిపి అభ్యర్థుల పైన అలాగే వైసిపి శ్రేణులపైన దాడులు నిర్వహిస్తున్న విషయం అక్కడక్కడ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.. ఈ నేపథ్యంలోనే తనను కూడా కొంతమంది టీడీపీ శ్రేణులు చంపేస్తాము అంటూ బెదిరిస్తున్నారని.. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తాను మాట్లాడిన ఒక వీడియోని షేర్ చేసింది శ్యామల..

జగన్మోహన్ రెడ్డితోనే అడుగులు..

ఇక వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. బిజెపి శ్రేణులకు, కూటమి శ్రేణులకు హార్దిక శుభాకాంక్షలు అలాగే వైసిపి కోసం కష్టపడి వైసిపి కోసం ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఎస్ ఓడిపోయాము. అయితే గెలిచిన నాడు ఏ రోజు కూడా విజయ గర్వంతో విర్రవీగలేదు.. అలాగే ఓడిన రోజు నిరాశ చెందిందే లేదు.. జగన్మోహన్ రెడ్డితో మనమందరం కలిసి నడిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము.. దేవుడిపై దయ వుంచి ప్రజలందరికీ మంచి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇక నేను ఎప్పటికీ వైసీపీతోనే.. జగన్మోహన్ రెడ్డితోనే నడుస్తాను. ఈ ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి , ఆంధ్ర ప్రజలకు ఎంత మంచి చేకూరాలో అంతా మంచే చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలిపింది శ్యామల..

- Advertisement -

చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు..

అలాగే తనను బెదిరిస్తున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసింది.. ఇప్పటికే చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి.. చాలామంది బెదిరిస్తున్నారు.. ఒక రకమైన భయం కూడా కలుగుతోంది. అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను.. మీకు ఒకటి నచ్చుతుంది.. నాకు ఒకటి నచ్చుతుంది.. మీకు టిడిపి నచ్చింది.. నాకు వైసీపీ నచ్చింది. మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు కదా.. నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు.. టార్గెట్ చెయ్యను కూడా.. దయచేసి అర్థం చేసుకోండి.. వైసిపి గెలుపు కోసం ఎంత చేయాలో అంతా చేశాను.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పే ముఖ్యం.. ఉన్నదే చెప్పాను.. లేనిది ఎక్కడ చెప్పలేదు. దయచేసి అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను అంటూ తెలిపింది శ్యామల.. మొత్తానికి అయితే శ్యామల భయాందోళనకు గురవుతోందని స్పష్టం అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు