Venky Kudumulu: అనౌన్స్ చేసారు.. అప్డేట్స్ లేవు

ఇండస్ట్రీ లో కొన్ని ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చెయ్యడం
అవి పట్టాలెక్కకపోవడం ఇదేమి కొత్తది కాదు.
కొన్ని కాంబినేషన్స్ పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారు,
కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ ఉండవు,
అవి జరుగుతాయని క్లారిటీ ఉండదు.

మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు మహేష్ కి. దూకుడు సినిమా థియేటర్స్ లో ఆడుతుండగానే “బిజినెస్ మేన్” ఫినిష్ చేసి థియేటర్స్ రిలీజ్ కి రెడీ చేసేసాడు పూరి.
వాళ్లద్దరి కాంబినేషన్ లో జనగణమన ప్రాజెక్ట్ వస్తుంది ఎంతోమంది వెయిట్ చేసారు. వాళ్ళు కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు.
కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు విజయదేవరకొండ చేస్తున్నాడు.

మహేష్ కెరియర్ లో ఒన్ నేనొక్కడినే సినిమా కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. చాలామందికి ఈ సినిమా ఇప్పటికి ఫేవరెట్. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అని అనౌన్స్ చేసిన తరువాత అది క్రియాటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్ట్ చెయ్యట్లేదు అని మహేష్ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.

- Advertisement -

మెగాస్టార్ రీ ఎంట్రీ ఫిలిం ను పూరీజగన్నాధ్ డైరెక్ట్ చేస్తారు అని అమితాబ్ బచ్చన్ సమక్షంలో అనౌన్స్ చేసారు చిరంజీవి, ఆ సినిమాకి ఆటో జానీ అని టైటిల్ కూడా ఫిక్స్ అయింది. ఆ సినిమాను అలానే పక్కన పెట్టిన ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చాడు బాస్.

ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న మెగాస్టార్ వెంకీ కుడుముల తో చెయ్యాల్సిన సినిమా గురించి అసలు అప్డేట్స్ ఇవ్వట్లేదు.
అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందా, పక్కకు తప్పుకుంటుందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు