Artist Prithwiraj : రూమర్లపై స్పందించిన కమెడియన్ పృత్విరాజ్… వాళ్లపైనే కేసు వేస్తానంటున్నాడు!

Artist Prithwiraj : టాలీవుడ్ ప్రముఖ సీనియర్ కమెడీయన్‌ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పాపులర్ అయిన ఇతను, చాలా సినిమాల్లో అలాంటి పాత్రలే వేశారు. ఇక ఇప్పుడు పాలిటిక్స్ లో ఎక్కువగా బిజీగా ఉన్నా, అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. కొన్ని వందల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఖడ్గం పృత్విరాజ్ గానే చాలా మందికి గుర్తుంటాడు. ఇప్పుడు మాత్రం ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు కాకుండా కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలే వేస్తున్నాడు. ఇదిలా ఉండగా… తాజాగా పృథ్వీరాజ్ పై గతంలో అతని మొదటి భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి పృథ్వీరాజ్ భరణం చెల్లించాలంటూ, అతనిపై విజయవాడలోని ఫ్యామిలీ కోర్టులో అప్పట్లో కేసు వేయడం జరిగింది.

Artist Prithwiraj Reacts On Arrest Warrent Rumours

భరణం చెల్లించాలని కోర్టు లో కేసు..

పృత్విరాజ్ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి పృధ్విరాజ్ రూ. 8 లక్షలు చెల్లించాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది ఫ్యామిలీ కోర్టు. అయితే ఈ ఆదేశాలను ఏమాత్రం పాటించని పృథ్వీరాజ్ హైకోర్టులో సవాలు చేశారు. దీంతో అక్కడి భార్య శ్రీలక్ష్మి ఆమె న్యాయవాదులు సప్ప రమేష్, సిహెచ్ వడ్డీ కాసులు, సుంకర రాజేంద్రప్రసాద్ లను సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే పృథ్విరాజ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా…. వాటిని లెక్క చేయకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరు కావడం లేదని లాయర్లు పిటిషన్ లో వెల్లడించారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ నెలకు రూ. 22 వేల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు వరకు ఉన్న బకాయిలు కూడా అన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే కోర్టువారి ఆదేశాల్ని పృత్విరాజ్ (Artist Prithwiraj) పాటించలేదని అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారని ఉదయం నుండి వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై పృథ్వీరాజ్ స్పందించారు.

- Advertisement -

వాళ్లపై కేసు వేస్తా! – పృత్విరాజ్…

ఇక ఈ రూమర్లపై తాజాగా పృత్విరాజ్ స్పందించాడు. తనపై తన భార్య వేసిన పిటిషన్ కి కోర్టువారు ప్రతినెల కొంత చొప్పున అమౌంట్ ని పే చేయమన్నారని తాను ప్రతినెలా క్రమం తప్పకుండా పే చేస్తున్నానని, ఏది పడితే అది తెలుసుకోకుండా న్యూస్ రాయకండని న్యూస్ ఛానెల్ లపై ఫైర్ అయ్యాడు. ఇక ఊరుకుండేది లేదని, తనపై తప్పుడు వార్తలు రాసిన యూట్యూబ్ ఛానల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాన్నని అన్నాడు. ఇది తమ కుటుంబ వ్యవహారమని దాన్ని కూడా తీస్తారా? కోర్టు కూడా మీరేనా? మా క్యారెక్టర్ ని దిగజార్చే ప్రయత్నాలు చేయకండి. దయచేసి అలా చేయకండి. నన్నడిగితే నేను చెప్పేవాణ్ని. కానీ ఇలా చేయాల్సింది కాదని. ఇక ఇప్పుడు వదిలే సమస్యే లేదని అన్నాడు. ఇక తనపై తప్పుడు వార్తలు రాసిన యూట్యూబ్ ఛానళ్ళు, అలాగే పలు వెబ్ సైట్స్ లపై చర్యలు తీసుకునే విధంగా తమ లాయర్లతో మాట్లాడుతున్నానని పృత్విరాజ్ వ్యాఖ్యానించాడు. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక పృత్వి రాజ్ ప్రస్తుతం పలు సినిమాల్లో షార్ట్ లెంగ్త్ ఉన్న రోల్స్ లోనే నటిస్తున్నాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు