Ashwini Dutt: ఎన్టీఆర్ హీరోయిన్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. ఐరన్ లెగ్ అంటూ..?

Ashwini Dutt.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న అశ్వినీ దత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 1974లో ఎన్టీఆర్ తో తెరకెక్కించిన ఎదురులేని మనిషి సినిమా నుంచి నేటి కల్కి 2898AD వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈయన వైజయంతి మూవీస్ బ్యానర్ ను స్థాపించి ఆ రేంజ్ లో సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మూడు తరాల హీరోలతో సినిమాలను నిర్మించిన ఘనత ఈయనకే సొంతం. ముఖ్యంగా తన సినిమాలలో విజువల్ వండర్ , భారీ తనం, హంగులు , ఆర్భాటాలు కచ్చితంగా ఉండాల్సిందే.

Ashwini Dutt: Producer's shocking comments on NTR's heroine. Iron leg..?
Ashwini Dutt: Producer’s shocking comments on NTR’s heroine. Iron leg..?

అశ్వినీ దత్ – చిరంజీవి మధ్య విడదీయరానిబంధం..

ఇదిలా ఉండగా కల్కి సినిమా తర్వాత ఈయన జోరు మరింత పెంచారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఎన్ని సక్సెస్ లు అందుకున్నా, ఒకానొక సమయంలో వరుస డిజాస్టర్లు ఎదురైనప్పుడు దత్ గారి పనైపోయింది అంటూ అందరూ అన్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో అశ్విని దత్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తులలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఒక వీరిద్దరిది విడదీయరాని బంధం కూడా.. అలా జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర వంటి చిత్రాలతో ఈ కాంబో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే అశ్విని దత్, చిరు కాంబినేషన్ అంటే ఇప్పటికీ క్రేజ్ అని చెప్పవచ్చు. అయితే వీరి కలయికలో వచ్చిన నాలుగవచిత్రం జై చిరంజీవ.

జై చిరంజీవ డిజాస్టర్ కి కారణం ఆమె..

అప్పటికే నువ్వు కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి వంటి క్లాసిక్ సినిమాలు తీసి మంచి ఊపులో ఉన్న కే.విజయ్ భాస్కర్ దర్శకుడిగా, చిరంజీవి హీరోగా , అశ్వినీ దత్ నిర్మాతగా సినిమా ప్రకటించడంతో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజు నుంచే ఆ మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా కాస్త డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇందులో కామెడీ పాటలు మాత్రం ఎప్పటికీ నవ్వు తెప్పిస్తాయి. ఇందులో మెగాస్టార్ సరసన సమీరారెడ్డి, భూమిక చావ్లా హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇందుకు గల కారణమేంటంటే ఒక్కొక్కరు. ఒక్కో విధంగా చెబుతారు. అశ్వినీ దత్ మాత్రం హీరోయిన్ సమీరా రెడ్డి కారణమని చెబుతున్నారు.

- Advertisement -

సమీరా ఐరన్ లెగ్..

అసలు విషయంలోకి వెళ్తే, ఒక ఇంటర్వ్యూలో అశ్వినీ దత్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ కి దర్శకత్వం చేసే అవకాశం రావడంతో ఆయన ఇండియాలోనే ఉండిపోయారు. సెకండ్ హీరోయిన్ గా సమీరా రెడ్డిని పెట్టుకోమని చెప్పారు. కానీ ఆమె ఒక ఐరన్ లెగ్,అయితే త్రివిక్రమ్ సమీరారెడ్డిని దృష్టిలో పెట్టుకొని సీను రాసానని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాము. నిజానికి త్రివిక్రమ్ రాసిన సీన్లు చాలా గొప్పగా ఉన్నాయి కానీ ఎందుకో బాగా రాలేదు అంటూ తెలిపారు అశ్వినీ దత్. ఒక ప్రస్తుతం అశ్విని దత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా సమీరారెడ్డి పై ఈయన చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యపరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు