Ashwini Dutt: బాబాయ్- అబ్బాయ్ చేతుల్లో మోసపోయిన కల్కి నిర్మాత.. ఏమైందంటే..?

Ashwini Dutt.. సీనియర్ ఎన్టీఆర్ ను మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు ఏకంగా మూడు జనరేషన్లను కవర్ చేసిన నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్. ఎన్నో చిత్రాలను నిర్మించి సినీ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా చలామణి అవుతున్నారు.. ఇటీవలే తాజాగా తన అల్లుడు , ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి అనే చిత్రాన్ని సుమారుగా రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించి..ఇప్పుడు అంతకు మించి కలెక్షన్స్ వసూలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అశ్వినీ దత్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అందులో భాగంగానే బాబాయ్ – అబ్బాయ్ అయిన జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అశ్వినీ దత్ ను మోసం చేశారనే వార్తలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Ashwini Dutt: The producer of Kalki who was cheated in the hands of father-father.. what happened..?
Ashwini Dutt: The producer of Kalki who was cheated in the hands of father-father.. what happened..?

జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమాతో నష్టం..

సీనియర్ ఎన్టీఆర్ హీరో గా ఎదురులేని మనిషి సినిమాతో నిర్మాతగా మారిన అశ్వినీ దత్ తెలుగు ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ నుంచి సినిమా వస్తుందంటే భారీతనం ఉండాల్సిందే.. ఏ హీరోతో సినిమా తెరకెక్కించినా సరే భారీ తనం చూపించేవారు. అలా అగ్నిపర్వతం, ఆఖరిపోరాటం , ఇంద్ర, జగదేకవీరుడు అతిలోకసుందరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఉన్నాయి.. అప్పట్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా శక్తి.. ఈ సినిమాతో నిర్మాతగా పూర్తిగా మునిగిపోయానని అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా కొట్టిన దెబ్బకు కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టిందని ఆయన చెప్పుకొచ్చారు..

బాలయ్య అశ్వమేథం తో కూడా నష్టం..

అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా ఆయన బాబాయ్ ప్రముఖ హీరో బాలకృష్ణ, శోభన్ బాబులతో కలిసి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వమేథం అనే సినిమా తీశారు.. ఈ సినిమా కూడా నిర్మాతగా అశ్వినీ దత్ ను పూర్తిగా ముంచేసింది.చిరంజీవి , శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తర్వాత బాలయ్య, శ్రీదేవి కాంబినేషన్లో ఈ సినిమా అనౌన్స్ చేశారు..అయితే శ్రీదేవీ బాలీవుడ్ సినిమాలో బిజీగా ఉండడం బాలయ్య డేట్స్ తో క్లాష్ అవడం కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు చేసి మీనా, నగ్మాలతో సినిమాను తెరకెక్కించారు. 1990 లోనే సుమారు రూ 8 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు.. ఇందులో శోభన్ బాబు కూడా నటించారు. మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ సినిమాలో అమ్రిష్ పురి విలన్ గా నటించారు.. ఇలా భారీతారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా గోరంగా డిజాస్టర్ గా నిలిచింది.

- Advertisement -

ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభం.. వారసుల చేతుల్లో పూర్తి నష్టం..

ఇకపోతే నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వైజయంతి మూవీస్ వారి వారసులైన బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ లతో భారీగా నష్టపోవడం బాధాకరమనే చెప్పాలి. ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమాలంటే మంచి సక్సెస్ అందుకుంటాయని నమ్మి కోట్లు పెట్టి మోసపోయాడు నిర్మాత అశ్వినీ దత్. మొత్తానికి అయితే బాబాయ్ అబ్బాయ్ సినిమాల విషయంలో అశ్విని దత్ పూర్తిగా నష్టపోయారని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు