Balakrishna – Ramoji Rao : బాలయ్య – రామోజీ రావు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్… కానీ అంత్యక్రియలకు బాలయ్య ఎందుకు వెళ్లలేదు?

Balakrishna – Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం రోజు ముగిసాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో ఉన్న స్మృతి వనంలో అంత్యక్రియలు నిర్వహించగా, ఆయన చితికి రామోజీ రావు కుమారుడు కిరణ్ నిప్పంటించారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు, భారీ ఎత్తున రామోజీ గ్రూప్ ఉద్యోగులు, సాధారణ ప్రజలు కూడా తరలివచ్చారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పాడెను మోయడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయంపై ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. రామోజీ రావు కుటుంబంతో మంచి బాండింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణ దంపతులు ఆయన అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదు? ప్రస్తుతం ఈ ప్రశ్న బాలయ్య అభిమానుల మెదడును తొలిచేస్తుంది.

బాలయ్య దంపతులకు రామోజీ రావుతో ఉన్న బంధం

సాధారణంగా బాలయ్య ప్రముఖులు ఎవరైనా చనిపోతే వాళ్లకు నివాళులు అర్పించి, వాళ్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. అయితే మరి బాలయ్య దంపతులకు రామోజీరావుతో ఉన్న బంధం ఏమిటి? అంటే.. బాలయ్య భార్య వసుంధర తండ్రి సూర్య రావు, రామోజీ రావు అప్పట్లో మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఎంత మంచి స్నేహితులంటే వసుంధర ఎక్కువగా రామోజీ రావు ఇంట్లోనే పెరిగింది.. ఆయనకు కూతుర్లు లేకపోవడంతో వసుంధరను సొంత కూతురులా చూసుకునేవారట రామోజీ రావు. ఆయన ఇంట్లోనే వసుంధరను చూసిన సీనియర్ ఎన్టీఆర్ ఆమెను బాలయ్యకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారట.

Ramoji Rao, Visionary Behind Ramoji Rao Film City, Dies at 85 - Tamil News  - IndiaGlitz.com

- Advertisement -

ఇంతటి డీప్ రిలేషన్ ఉన్న రామోజీరావుకి నివాళులు అర్పించడానికి నందమూరి బాలకృష్ణ గానీ, ఆయన భార్య వసుంధర గానీ రాకపోవడం చర్చకు దారి తీసింది. బాలయ్య అంత్యక్రియలకు అయితే వెళ్లలేదు కానీ సోషల్ మీడియా వేదికగా రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అంతటి ప్రత్యేక అనుబంధం ఉన్న రామోజీ రావుకు కడసారి ఆయన నివాళులు అర్పించేందుకు రాకపోవడం ఏంటో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే బాలయ్య, రామోజీ రావు మధ్య ఏమైనా విబేధాలు తలెత్తాయా? అనే అనుమానాలు నెలకొన్నాయి.

రామోజీరావు అంత్యక్రియలకు హాజరైన సెలబ్రిటీలు

రామోజీ రావు అంతిమ సంస్కారాలకు టాలీవుడ్ నుంచి రవిబాబు, రఘు బాబు, డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాటు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఇక చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, పవన్ కళ్యాణ్ తదితరులు శనివారం ఉదయం ఈనాడు కార్పొరేట్ బిల్డింగ్ లో సందర్శనార్థం ఉంచిన రామోజీ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే రాజకీయ వర్గాల నుంచి నారా లోకేశ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వెనిగండ్ల రాము బండి సంజయ్, కిషన్ రెడ్డి, వి.హనుమంతరావు, నామా నాగేశ్వరరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డి తదితరులు రామోజీ రావు అంత్యక్రియలల్లో పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు