Balakrishna : దండ కొనుక్కురా… అభిమానికి బాలయ్య సెటైర్

Balakrishna : బాలయ్య జనాల్లోకి వచ్చాడంటే చాలు కచ్చితంగా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తారు. సాధారణంగా ఇలాంటి సమయంలో బాలయ్య ఎక్కువగా వివాదాల్లోనే చిక్కుకుంటారు. తాజాగా మరోసారి బాలయ్య ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయంతోనే వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి వార్త కొంచెం డిఫరెంట్. అదేంటంటే…

అభిమానిపై బాలయ్య సెటైర్…

తాజాగా బాలయ్య అభిమానులతో పాటు టిడిపి కార్యకర్తలను కలిశారు. అందులో భాగంగానే కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ ఆయనతో ముచ్చటిస్తూ కనిపించారు. అందులో కొందరు బాలకృష్ణకు దండ వేయాలని ఉత్సాహం కబారిచారు. దండతో వాళ్ళని చూసిన బాలయ్య ఆ దండ ఎక్కడ తెచ్చావ్ అని ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడి నుంచి ఎత్తుకొచ్చావా కొనుక్కొచ్చావా ? అని అడిగాడు. అభిమాని బాలయ్య ప్రశ్నకు కాదు సార్ తెచ్చుకున్నాం అని చెప్పాడు. వెళ్లి కొనుక్కు రా అంటూ సైటైరికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు బాలయ్య. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తర్వాత జై బాలయ్య నినాదంతో ఆ ప్రదేశం మార్మోగింది. మొత్తానికి కూటమి గెలుపుతో బాలయ్య ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. ఎప్పటిలా కాకుండా తాజాగా బాలయ్య చాలా కూల్ గా కనిపించారు. దీంతో ఎవరో ఒకరి చెంప పగలగొట్టి బాలయ్య ఈసారి వివాదంలో నిలవకపోవడం ఆయన అభిమానులకు కూడా హ్యాపీగా అనిపించింది.

Nandamuri Balakrishna: అనిల్ తర్వాత బాలయ్య ఆ స్టార్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడా..? | Nandamuri balakrishna is going to make a film with director bobby au51 | TV9 Telugu

- Advertisement -

త్వరలో బాలయ్య సెట్స్ పైకి…

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీని ప్రస్తుతానికి NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా, అందరిని ఆకట్టుకుంది. ఎలక్షన్స్ కంటే ముందే ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు . అయితే ఆ తర్వాత 2024 ఎన్నికల ప్రచారంలో బిజీగా మారిన బాలయ్య ఈ సినిమా నుంచి విరామం తీసుకున్నారు. ఫలితంగా ఎన్.బి.కె 109 మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ రావడం, కూటమి గెలుపుతో చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టడంతో ఫుల్ ఖుషి గా ఉన్న బాలయ్య తిరిగి హైదరాబాద్ వచ్చేసారు. ఇక ఈ సినిమాకు సంబంధించి బాబి కొత్తగా వారం రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాడని, బాలయ్య త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నాడని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌతేల హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది.

కాగా బాలయ్య చివరి సారిగా భగవంత్ కేసరి మూవీలో కనిపించారు. ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీని కూడా అనౌన్స్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి బాలయ్య ఈ ప్రాజెక్టులో హీరోగా నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు