Bhumika: ఆ హీరో మరణం తర్వాత కోలుకోలేకపోయా

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ భూమిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన దాదాపుగా ఆక్ట్ చేసింది. అంతేకాదు ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా సక్సెస్ అయ్యాయి. అయితే పెళ్లి తర్వాత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న భూమిక.. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్ సినిమాలో నటించింది. గతంలో సల్మాన్ ఖాన్ తేరేనామ్, దిల్ నే జిసే ఆప్నా కహా సినిమాలలో అతడికి జోడిగా నటించిన భూమిక చావ్లా.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సోదరిగా కనిపించింది.

ఆ చిత్రమే “కిసీకా భాయ్ కిసీకా జాన్”. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ భార్య పాత్రలో నటించింది భూమిక. అంటే వరుసకు సల్మాన్ ఖాన్ కు సోదరి పాత్రను పోషించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమిక.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి మాట్లాడింది. “ఎం.ఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ” లో సుశాంత్ సింగ్ రాజపుత్ అక్క పాత్రలో నటించింది భూమిక.

అయితే ఈ సినిమా తీసేటప్పుడు కొన్ని సన్నివేశాలు రాంచీలో తీశారని.. ఆ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన జీవితం, ఇతర విజయాల గురించి మాట్లాడే వాడని గుర్తు చేసుకుంది. అయితే కోవిడ్ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త తెలిసి చాలా షాక్ అయ్యానని తెలిపింది. ఆ సమయంలో తాను ముంబైలో ఉన్నానని.. తనకి మొదట మెసేజ్ వచ్చినప్పుడు నమ్మలేకపోయానని తెలిపింది. దీంతో వాట్సప్ ఓపెన్ చేయగానే మెసేజ్ లతో నిండిపోయిందని.. ఈ సంఘటన నుంచి కోలుకోవడానికి తనకి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది భూమిక.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు