Manjummel Boys: ఈ ఏడాది రిలీజ్ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ మూవీ కూడా ఒకటి. మలయాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా ఈ చిత్రం నిలిచింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఏకంగా రూ. 2 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళం లో ఘన విజయం సాధించిన ఈ సినిమాను చిత్ర యూనిట్ తెలుగులో కూడా రిలీజ్ చేసింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ సైతం లభించింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా దూసుకుపోయింది ఇక ఇలా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ యూనిట్కు అనుకోని షాక్ తగిలింది. ఈ మూవీ యూనిట్ కి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు.
ఈ సినిమా క్లైమాక్స్ లో తాను కంపోజ్ చేసిన గుణ చిత్రంలోని కన్మణి పాటను తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకు చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజా తరపు లాయర్ నోటీసులు పంపించారు. కాపీ రైట్ చట్ట ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజా కు చెంది ఉన్నాయి. తమ సినిమాలో ఈ పాటను ఉపయోగించాలంటే హక్కులు పొందిన వ్యక్తికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులలో పేర్కొన్నారు.