Chiranjeevi : వాల్తేరు వీరయ్యకు లైన్ క్లియర్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబిల మోస్ట్ అవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యూర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం జనవరి 13న థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో వరుస అప్డేట్లతో మూవీపై హైప్ ని క్రియేట్ చేస్తుంది మూవీ యూనిట్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, పూనకాలు లోడింగ్ అనే పాటలు విడుదల చేయగా, ఇప్పటికే పెద్ద హిట్స్ గా నిలిచాయి. జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ ఆర్కే బీచ్ లో ఘనంగా ప్లాన్ చేశారు. కానీ ఏపీ సర్కార్ దానికి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులకు లైన్ క్లియర్ అయింది.

ఈ నెల 8న విశాఖ ఆర్కే బీచ్ లో జరగాల్సి ఉన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో ఈవెంట్ ను కాలేజ్ గ్రౌండ్ కు మార్చేశారు. ఇక తాజాగా మైత్రి మూవీస్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో ట్రైలర్ రిలీజ్ అప్డేట్, మాస్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్‌ రేపు సాయంత్రం రిలీజ్‌ చేస్తున్నామని.. జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని ఓ పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషిలో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు