Chiranjeevi: మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న రీ రిలీజ్… ఇప్పుడేం చేద్దాం?

Chiranjeevi : రీసెంట్ టైమ్స్ లో కొన్ని సినిమాలను థియేటర్లో చూడలేకపోయాం అని అనుకోకుండా రీ రిలీస్ చేయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు అనే సినిమాని ముందు రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అదే తరుణంలో పోకిరి సినిమాను కూడా రిలీజ్ చేశారు. మహేష్ బాబు కెరియర్ లో ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాకుండా సినిమా ప్రేమికులకు ఎంతో ఇష్టమైన సినిమాలు ఈ రెండు. ఈ రెండు సినిమాలను ఫ్యాన్స్ అని సంబంధం లేకుండా చాలామంది వెళ్లి థియేటర్ దగ్గర ఎంజాయ్ చేశారు.

ఇక తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు సినిమాను మొదట రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత జల్సా సినిమా కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రెండు కోట్ల కలెక్షన్స్ కూడా వసూలు చేసింది. మహేష్ బాబు తో మొదలైన ఈ రీ రిలీజ్ సందడి పవన్ కళ్యాణ్ సినిమాతో పీక్ కి వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత ప్రభాస్ వర్షం, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, అల్లు అర్జున్ దేశముదురు, రవితేజ మిరపకాయ్ వంటి సినిమాలు కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు.

Indra

- Advertisement -

డైలమా లో మెగా ఫ్యాన్స్

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంద్ర రీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయడానికి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. కేవలం మెగాస్టార్ పుట్టినరోజు మాత్రమే కాకుండా వైజయంతి బ్యానర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా గురించి చాలా ఎలివేషన్లు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూ వచ్చాం. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటుగా శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందరూ ఇంద్ర అని ఫిక్స్ అయిన తర్వాత మళ్లీ శంకర్ దాదా ఇప్పుడెందుకు అంటూ మెగా ఫాన్స్ మధ్య చిన్నపాటి సోషల్ మీడియా వార్ మొదలైంది. ఇప్పుడు దీనిని ఆపే ప్రయత్నం చేద్దామా లేకుంటే ఇలానే కానిద్దామా అని డైలమా లో పడ్డారు మెగా ఫ్యాన్స్.

అప్పట్లో ఆదరణ లభించని కొన్ని సినిమాల్లో కూడా రీ రిలీజ్ తర్వాత మంచి ఆదరణ లభించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలతో పాటు సెవెన్ జి బృందావన్ కాలనీ సినిమా కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు