Chiranjeevi: సీఎం ని కలిసిన చిరు.. అసలేమైందంటే..?

Chiranjeevi.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాదు, ఆ ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడంలో కూడా ఎప్పుడు ముందుంటారు..అందులో భాగంగానే తాజాగా ఈయన చేసిన ఒక మంచి పని అందరూ ప్రశంసించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే గత వారం రోజుల క్రితం కేరళలోని వాయనాడు లో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. దాదాపు 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఈ విపత్కర సమయంలో ఎవరికి వారు తమ వంతు బాధ్యతగా స్పందించి డబ్బులను విరాళాలుగా ప్రకటిస్తున్నారు.

Chiranjeevi: What happened.. Chiranjeevi met the CM..?
Chiranjeevi: What happened.. Chiranjeevi met the CM..?

సీఎంను కలిసిన చిరంజీవి..

అందులో భాగంగానే తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ ఇలా ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు తమ వంతుగా లక్షల రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వంతు బాధ్యతగా స్పందించిన చిరంజీవి అలాగే ఆయన కొడుకు రామ్ చరణ్ దాదాపు కోటి రూపాయలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించారు. అయితే తాజాగా ఆయన ఈ డబ్బును అందజేయడానికి నేరుగా సీఎంని కలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సీఎం ని కలిసి చెక్ అందజేసిన చిరంజీవి..

తాజాగా పద్మ విభూషణ్ మెగాస్టార్ డా.చిరంజీవి గ్లోబల్ స్టార్ డా. రామ్ చరణ్ వెంటనే స్పందించారు. అందులో భాగంగానే తాజాగా గత కొన్ని గంటల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఈ చెక్ ను అందజేయడానికి.. గౌరవనీయులైన కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయి విజయన్ ను కలసి చెక్కు అందజేయడానికి చిరంజీవి త్రివేండ్రంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి సిబ్బంది ఆయనను సీఎం క్యాంప్ ఆఫీస్ కి తీసుకెళ్లినట్లు అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రిని కలిసి అక్కడి ప్రజల పరిస్థితిని తెలుసుకొని వారికి మరింత సహాయం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించిన చిరంజీవి నేరుగా ఆ చెక్ ను కేరళ వెళ్లి ముఖ్యమంత్రికి అందజేయడం మరో గొప్ప విషయమని చెప్పవచ్చు.

- Advertisement -

చిరంజీవి సినిమాలు..

ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది భోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ చవిచూచిన ఈయన ఈసారి ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. అందులో భాగంగానే బింబిసారా సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్న ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాని చేస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అందులో భాగంగానే సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు చిరంజీవి. ఒకవైపు సినిమాలు మరొకవైపు పలు యాడ్స్ అంటూ బిజీగా ఉన్న ఈయన ఇలాంటి సమయంలో తన పనులన్నింటినీ పక్కన పెట్టి, నేరుగా కేరళ వెళ్లడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు