Chiranjeevi on SrNTR : ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాల్సిందే…. మళ్లీ డిమాండ్ చేసిన చిరు

Chiranjeevi on SrNTR : ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాల్సిందేనంటూ…. మళ్లీ డిమాండ్ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ ఎన్టీఆర్. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీని ఏర్పాటు చేసి… 9 నెలలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు.

తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు… ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడం… అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇక ఆయన మరణించినా కూడా పార్టీని చంద్రబాబు నాయుడు లీడ్ చేస్తున్నారు. ఇలా ఒక టాలీవుడ్ స్టార్… అలాగే రాజకీయ నాయకుడిగా ఎంతో ప్రాముఖ్యత తెచ్చుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. అయితే ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ 101 వ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాటు వద్ద ఆయనకు నివాళులర్పించారు.

- Advertisement -

ఇక ఈ తరుణంలోనే చిరంజీవి కూడా ఎన్టీఆర్‌ కు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు చిరంజీవి. కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం అన్నారు. భావితరాలకు ఆదర్శం అని వివరించారు. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు చిరంజీవి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు