Murali Mohan : సీఎం సొంత అన్ననే వదల్లేదు నేనెంత…. హైడ్రా నోటీసులపై మూరళీ మోహన్ రియాక్షన్

Murali Mohan : మనిషికి నిజమైన కష్టం ఎప్పుడూ ప్రకృతి నుంచి వస్తుంది. ఈరోజు బీచ్ రోడ్డున ప్రశాంతంగా కూర్చుని ఉన్న మనల్ని అదే బీచ్ నుంచి ఒక అలొచ్చి అందరిని ఒకేసారి తీసుకెళ్లి పోవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరదలు ప్రళయ తాండవం చేస్తున్నాయి. భారీగా వర్షాలు కురవడం వలన రెండు ప్రాంతాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఖమ్మం విజయవాడ ప్రాంతాల్లో ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అయిపోయాయి.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా మూమెంట్ ను తీసుకొచ్చి, అక్రమ కట్టడాలను కూల్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా నాగార్జున N కన్వెన్షన్ కూడా కూల్చేశారు. ఇది కూల్చాలని ఎప్పటినుంచో రేవంత్ రెడ్డి ప్లాన్లో ఉన్నారు. కేవలం ఇది మాత్రమే కాకుండా అక్రమంగా చెరువులను ఆక్రమించి కట్టిన అన్ని కట్టడాలను కూల్చే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన సర్వ హక్కులను అధికారులకు ఇచ్చేశారు. ఇదే విషయంపై జనసేన నేత సినీ నటులు నాగబాబు కూడా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడారు.

రీసెంట్గా ప్రొడ్యూసర్, నటులు మురళీమోహన్ కూడా దీనిపై స్పందించారు. ఇప్పటివరకు లైఫ్ లో ఏ సీఎం కూడా ఇలా చేయలేదు. హైడ్రాను చాలా సీరియస్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. తమ సొంత అన్నయ్య బిల్డింగ్ కూడా అలానే ఉంది అని అంటే కూల్చేయండి అని చెప్పారట. ఈ విషయం గురించి ఎంతటి పై అధికారులు ఫోన్ చేసినా కూడా మీరు ఆపకండి. స్వయంగా నేను ఫోన్ చేసినా కూడా నా మాట వినకండి అని సర్వహక్కులను అధికారులకు ఇచ్చేశారు.  అంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

CM Revanth Reddy

జై బేరి సంస్థ లో మురళీమోహన్ సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లకు సంబంధించిన జై బేరి ఆఫీసును కూడా కూల్చేయడానికి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం చాలామంది సొంత అన్నయ్యని సీఎం రేవంత్ రెడ్డి వదలలేదు. ఇంకా మిగతా వాళ్ళని అసలు వదలరు అక్రమ కట్టడాలన్నిటిని కూల్చడానికి తీసుకున్న నిర్ణయంపై చాలామంది సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు