Devara Dialogue : ఊరునే ఉప్పొంగించే వీరుడు… దేవర నుంచి మెంటలెక్కించే డైలాగ్ లీక్..!

Devara Dialogue.. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా వైడ్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ, దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడమే కాదు.. తొలిసారి తెలుగు స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడంపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ తో పాటు ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Devara Dialogue : The hero who cheers up the town... The mind-blowing dialogue from Devara is leaked
Devara Dialogue : The hero who cheers up the town… The mind-blowing dialogue from Devara is leaked

దేవర నుంచీ మెంటలెక్కించే డైలాగ్ లీక్..

ఇటీవలే జాన్వీ కపూర్ – ఎన్టీఆర్ మధ్య రొమాన్స్ సాంగ్ ని కూడా విదేశాలలో చిత్రీకరించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం షూటింగ్ ను శరవేగం చేసింది.. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ లీక్ అవడంతో సినిమాపై మరింత హైప్ పెరిగిందని చెప్పవచ్చు.. తాజాగా ఈ సినిమా నుంచి.. “సాదాసీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా” అనే మెంటలెక్కించే డైలాగ్ ను విడుదల చేశారు. ఇది ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అన్నట్టుగా తెలుస్తోంది.. మొత్తానికైతే దేవర నుంచి విడుదలైన ఈ డైలాగ్ మాస్ అభిమానులకు ఫుల్ మసాలా అని చెప్పడంలో సందేహం లేదు.. ముఖ్యంగా ఈ డైలాగులకు థియేటర్లలో విజిల్లు, చప్పట్ల మోత మోగించడం ఖాయమని.అప్పుడే అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాలు..

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ వంటి మల్టీ స్టారర్ మూవీ చేసి ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను దక్కించుకున్నాడు.. అంతేకాదు ఈ సినిమా కారణంగానే మొదటిసారి ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచి తన హుందాతనాన్ని నిరూపించారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత అదే రేంజ్ లో సినిమాలు తీయడం మొదలుపెట్టారు ఎన్టీఆర్.. అందులో భాగంగానే ఇప్పుడు దేవర సినిమా చేస్తున్నారు.. ఈ దేవర సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఆ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని దేవర 2 విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో..

దేవర మొదటి భాగం పూర్తయిన వెంటనే కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు అందుకున్న ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా.. ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరును కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఇక ఇందులో ఎన్టీఆర్ హీరో గానే కాకుండా విలన్ గా కూడా అలరించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం ఎన్టీఆర్ కి బాగా కలిసి వస్తోందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు