Devara: మూవీ విషయంలో ఆ సస్పెన్స్ కొనసాగిస్తారా..? ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

Devara.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి , ఆ తర్వాత హీరోగా మారి నేడు గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR ) అలియాస్ తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన చిత్రాలతో అభిమానులలో ఫాలోయింగ్ పెంచుకోవడమే కాదు అంతర్జాతీయ స్థాయి సొంతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ఎన్టీఆర్. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ అందుకున్న ఈయన ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

Devara: Will you continue the suspense about the movie? What are the fans saying?
Devara: Will you continue the suspense about the movie? What are the fans saying?

సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల..

కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ హై వోల్టేజ్ యాక్షన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలలో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొత్తంగా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు చిత్ర బృందం. ఇటీవల తన పాత్ర షూటింగ్ పార్ట్ ను కూడా ఎన్టీఆర్ పూర్తి చేశారు. మిగతా పార్ట్ ను మేకప్ త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.

అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది..

ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు విపరీతమైన రెస్పాన్స్ ను అందుకున్నాయి. అంతేకాదు ఈ పాటల రీల్స్ కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. దీనికి తోడు ఎన్టీఆర్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో హైప్ పెంచే క్రమంలో.. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అండ్ ఒక పోస్టర్ ను విడుదల చేయగా.. ఇప్పుడు మరో పోస్టర్ తో ఆకట్టుకున్నారు. రెండు డిఫరెంట్ గెటప్లతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసి.. అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది అంటూ అంచనాలు పెంచేశారు. జూనియర్ ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడు అని చెప్పి ఒక జూనియర్ ఆర్టిస్టు కొద్ది రోజుల క్రితం కొంత స్టోరీని లీక్ చేశారు. అంతకుముందు దేవర మూవీ స్టోరీ కి సంబంధించి ఎలాంటి లీక్స్ రాలేదు.

- Advertisement -

ఈ సీక్రెట్ మైంటైన్ చేస్తే చాలు.. సినిమా హిట్ పక్క..

మరొకవైపు తీర ప్రాంత భూమిలో జరిగిన ఘటనల చుట్టూ సినిమా సాగుతుందని , భావోద్వేగంతో కూడిన సంఘటనలు ఉంటాయని, హీరో నిరాశ్రయులకు రక్షకునిగా పోరాడతాడు అంటూ రాసుకువచ్చారు. దీంతో పూర్తిగా స్టోరీ ఏంటనేది అర్థం కాకపోయినా, జస్ట్ మాత్రం మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ వరకు స్టోరీ విషయంలో మేకర్స్ ఇలా కంటిన్యూ చేస్తే చాలని కూడా చెబుతున్నారు మొత్తానికైతే సినిమాపై బజ్ పెరగాలి అంటే సినిమా కథను కాస్త రహస్యంగా ఉంచడమే బెటర్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని రామారావు ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా , జాన్వి కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు